www.ntodaynews.com
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కలకలం.. తొలగించిన రోగి కాలును పీక్కుతిన్న కుక్క
ఆంధ్రప్రదేశ్
/
కృష్ణా
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో తీవ్ర నిర్లక్ష్యం వెలుగుచూసింది. ఆసుపత్రి ఆక్సిజన్ ప్లాంట్ సమీపంలో రోగికి తొలగించినట్లుగా అనుమానిస్తున్న కాలును ఓ కుక్క పీక్కుతింటున్న దృశ్యాలు కలకలం రేపాయి.
ఆ కాలు ఆసుపత్రిలో శస్త్రచికిత్స సమయంలో తొలగించినదేనా.. లేక బయట నుంచి అక్కడికి చేరిందా అన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం వివరణ ఇవ్వాల్సి ఉంది.