www.ntodaynews.com
విజయవాడలో డ్రగ్స్పై ఉక్కుపాదం.. వీధుల్లోకి దిగిన ఐజీపీ, కలెక్టర్!
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
విజయవాడలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన భారీ అవగాహన ర్యాలీలో ఐజీపీ ఏ.కె. రవికృష్ణ, ఐపీఎస్, జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, ఐఏఎస్ పాల్గొన్నారు. యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ ర్యాలీలో అధికారులు ప్రజలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు.
"డ్రగ్స్కు నో చెప్పండి... జీవితానికి యెస్ చెప్పండి" అంటూ నినాదాలు మార్మోగగా, విద్యార్థులు, పోలీసులు, వివిధ శాఖల అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని, సమాజం మొత్తం కలిసి ఈ సామాజిక దురాచారంపై పోరాడాల్సిన అవసరం ఉందని అధికారులు పిలుపునిచ్చారు.