www.ntodaynews.com
విస్సన్నపేటలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం – రైతులకు కీలక సూచనలు
ఆంధ్రప్రదేశ్
విస్సన్నపేటలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం – రైతులకు కీలక సూచనలు
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలంలో రాష్ట్ర ప్రభుత్వం PACS, DCMS ద్వారా ఇప్పటివరకు సుమారు 3500 టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంకా రెండు వారాల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అకాల వర్షాల ప్రభావం నేపథ్యంలో రైతులు మరియు సహకార సంఘాలు ముందుకు వచ్చి అందుబాటులో ఉన్న ట్రాక్టర్లకు GPS ట్రాకర్లు అమర్చుకోవాలని సూచించారు. ఇలా చేయడం ద్వారా ధాన్యాన్ని సకాలంలో రైస్ మిల్లులకు తరలించి నష్టాలను తగ్గించుకోవచ్చని వివరించారు.
అదే సమయంలో MTU 1010 రకం ధాన్యంలో నూక శాతం ఎక్కువగా ఉండటంతో, తినడానికి ఎక్కువగా వినియోగిస్తున్నప్పటికీ, వచ్చే దాల్వా సీజన్లో ఈ రకం సాగు చేయకూడదని రైతులకు విజ్ఞప్తి చేశారు.