BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

విస్సన్నపేటలో ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 07:49 PM
89 వీక్షణలు

విస్సన్నపేటలో ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు

ఎరువుల అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తప్పవని తిరువూరు ఆర్డీవో ఏ. కుమార్ హెచ్చరించారు. బుధవారం విస్సన్నపేట మండలంలోని పలు ఎరువుల దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

తనిఖీల సందర్భంగా యూరియా నిల్వలు, ఐఎఫ్‌ఎంఎస్ స్టాక్ రిజిస్టర్లు, భౌతిక నిల్వలు, రికార్డులను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు ఎరువుల విక్రయాలు నిర్వహించాలని డీలర్లకు సూచించారు.

అనధికారికంగా ఎరువుల విక్రయాలు, నిల్వల్లో వ్యత్యాసాలు లేదా అక్రమాలు గుర్తిస్తే సంబంధిత డీలర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో స్పష్టం చేశారు.

ఈ తనిఖీల్లో తహసీల్దార్ కె. లక్ష్మీ కళ్యాణి, మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మి, ఎస్సై అర్జున్, రెవెన్యూ డీటీ విజయభాస్కర్, వ్యవసాయ ఏఈఓ జీ. ఉషారాణి పాల్గొన్నారు.