విస్సన్నపేటలో ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు
విస్సన్నపేటలో ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు
ఎరువుల అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తప్పవని తిరువూరు ఆర్డీవో ఏ. కుమార్ హెచ్చరించారు. బుధవారం విస్సన్నపేట మండలంలోని పలు ఎరువుల దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తనిఖీల సందర్భంగా యూరియా నిల్వలు, ఐఎఫ్ఎంఎస్ స్టాక్ రిజిస్టర్లు, భౌతిక నిల్వలు, రికార్డులను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు ఎరువుల విక్రయాలు నిర్వహించాలని డీలర్లకు సూచించారు.
అనధికారికంగా ఎరువుల విక్రయాలు, నిల్వల్లో వ్యత్యాసాలు లేదా అక్రమాలు గుర్తిస్తే సంబంధిత డీలర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో స్పష్టం చేశారు.
ఈ తనిఖీల్లో తహసీల్దార్ కె. లక్ష్మీ కళ్యాణి, మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మి, ఎస్సై అర్జున్, రెవెన్యూ డీటీ విజయభాస్కర్, వ్యవసాయ ఏఈఓ జీ. ఉషారాణి పాల్గొన్నారు.