BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

విస్సన్నపేటలో హమాలీల ఆగ్రహం.. కూలి బకాయిలపై సివిల్ సప్లై పాయింట్ ఎదుట ఏఐటీయూసీ ధర్నా!

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 06:09 AM
31 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం స్థానిక విస్సన్నపేట లో

నెలల తరబడి కష్టపడి పనిచేసినా కూలి డబ్బులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆరోపిస్తూ సివిల్ సప్లై హమాలీ ముఠా వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో హమాలీ కార్మికులు విస్సన్నపేట సివిల్ సప్లై పాయింట్ ఎదుట ఆందోళనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా చేపట్టిన ఈ ధర్నాలో కార్మికులు ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా నాయకుడు మర్సకట్ల త్యాగరాజు మాట్లాడుతూ, "రెక్కాడితే గానీ డొక్కాడని హమాలీలకు చేసిన పనికి నెలలు గడిచినా కూలి చెల్లించకపోవడం దారుణం. మే నెలలో చేసిన పనికి ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులు కుటుంబాలను ఎలా పోషించాలి?" అని ప్రశ్నించారు.

అలాగే విస్సన్నపేట మండలంలోని మూడు రేషన్ షాపుల ఎగుమతి, దిగుమతి పనులను స్థానిక హమాలీలకు కాకుండా తిరువూరు పాయింట్ కార్మికులతో చేయించడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఆ పనులను విస్సన్నపేట హమాలీ కార్మికులకే అప్పగించాలని డిమాండ్ చేశారు.

హమాలీ కార్మికులు ఎదుర్కొంటున్న కూలి బకాయిలు, ఉపాధి సమస్యలు, ఇతర పెండింగ్ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని హెచ్చరించారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

ఈ ధర్నాకు ఏఐటీయూసీ ముఠా వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు దంతాల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా, పెద్ద సంఖ్యలో హమాలీ కార్మికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.