www.ntodaynews.com
విస్సన్నపేటలో విద్యుత్ వినియోగదారుల సమస్యలపై ప్రజా దర్బార్.. వోల్టేజ్ సమస్యలపై 30కి పైగా అర్జీలు
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం పరిధిలోని విస్సన్నపేటలో ఈరోజు విద్యుత్ వినియోగదారులు మరియు రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజా దర్బార్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలపై అర్జీలను సమర్పించారు. ముఖ్యంగా లో వోల్టేజ్ సమస్యపై అధికంగా ఫిర్యాదులు వచ్చాయి. మొత్తం 30కి పైగా అర్జీలు అందినట్లు సమాచారం.
ఈ అర్జీలపై CGRF అధికారి విక్టర్ ఇమ్మానుయేల్ ఆధ్వర్యంలో సంబంధిత విద్యుత్ అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వినియోగదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
సాయంత్రం 4 గంటల వరకు ఈ ప్రజా దర్బార్ కొనసాగనుంది.