www.ntodaynews.com
విశాఖ తీరానికి LPG నౌకలు…
ఆంధ్రప్రదేశ్
/
విశాఖపట్నం
విశాఖ తీరానికి LPG నౌకలు… ఇంధన సంక్షోభానికి ఊరటనిచ్చిన చేరికలు
విశాఖపట్నం, మార్చి 26: గ్యాస్, ఆయిల్ కొరతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో విశాఖ తీరానికి భారీ LPG, చమురు నౌకలు చేరుకోవడం ఊరటనిచ్చింది. హార్బర్ మౌత్ వద్ద భారీ LPG నౌక “బిర్చ్” లంగరేయగా, మరోవైపు MT “పెట్రాయిట్” ఇప్పటికే విశాఖ పోర్టుకు చేరుకుంది.
భారీ నిల్వలతో ఈ నౌకలు రావడంతో ఇంధన సరఫరా వ్యవస్థకు తాత్కాలిక ఊరట లభించినట్టు అధికారులు పేర్కొన్నారు. గ్యాస్, చమురు నిల్వలు పెరగడంతో రాబోయే రోజుల్లో సరఫరా సమస్యలు కొంతవరకు తగ్గే అవకాశముందని భావిస్తున్నారు.
ప్రస్తుతం నౌకల నుంచి నిల్వల దింపుదల ప్రక్రియ వేగంగా కొనసాగుతుండగా, సరఫరా వ్యవస్థను సాధారణ స్థితికి తీసుకురావడంపై అధికారులు దృష్టి సారించారు.