BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

విశాఖ తీరానికి LPG నౌకలు…

ఆంధ్రప్రదేశ్
/ విశాఖపట్నం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Mar, 2026 - 07:39 PM
78 వీక్షణలు

విశాఖ తీరానికి LPG నౌకలు… ఇంధన సంక్షోభానికి ఊరటనిచ్చిన చేరికలు

విశాఖపట్నం, మార్చి 26: గ్యాస్, ఆయిల్ కొరతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో విశాఖ తీరానికి భారీ LPG, చమురు నౌకలు చేరుకోవడం ఊరటనిచ్చింది. హార్బర్ మౌత్ వద్ద భారీ LPG నౌక “బిర్చ్” లంగరేయగా, మరోవైపు MT “పెట్రాయిట్” ఇప్పటికే విశాఖ పోర్టుకు చేరుకుంది.

భారీ నిల్వలతో ఈ నౌకలు రావడంతో ఇంధన సరఫరా వ్యవస్థకు తాత్కాలిక ఊరట లభించినట్టు అధికారులు పేర్కొన్నారు. గ్యాస్, చమురు నిల్వలు పెరగడంతో రాబోయే రోజుల్లో సరఫరా సమస్యలు కొంతవరకు తగ్గే అవకాశముందని భావిస్తున్నారు.

ప్రస్తుతం నౌకల నుంచి నిల్వల దింపుదల ప్రక్రియ వేగంగా కొనసాగుతుండగా, సరఫరా వ్యవస్థను సాధారణ స్థితికి తీసుకురావడంపై అధికారులు దృష్టి సారించారు.