BREAKING
వెల్లటూరులో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన శాఖ ప్రారంభం. అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుక సుబ్బరాజునగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు.. ఎమ్మెల్యే బొండా ఉమా క్షేత్రస్థాయి పరిశీలన అవుట్‌ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి పల్నాడు జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ సుండుపల్లి సీఐగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ రెడ్డి.. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వెల్లటూరులో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన శాఖ ప్రారంభం. అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుక సుబ్బరాజునగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు.. ఎమ్మెల్యే బొండా ఉమా క్షేత్రస్థాయి పరిశీలన అవుట్‌ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి పల్నాడు జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ సుండుపల్లి సీఐగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ రెడ్డి.. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
www.ntodaynews.com

వల్లంపట్ల పాఠశాల విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 07:17 PM
16 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, ఏ.కొండూరు మండలం వల్లంపట్ల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విలేజ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఇంజనీర్ కుటుంబ నాగేశ్వరరావు విద్యార్థులకు 32 స్టీల్ వాటర్ బాటిల్స్ అందజేశారు. మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) కేశవరావు చేతుల మీదుగా విద్యార్థులకు బాటిల్స్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎంఈఓ కేశవరావు మాట్లాడుతూ, ప్రతిరోజూ తగినంత నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో అవసరమని తెలిపారు. స్టీల్ వాటర్ బాటిల్స్ వినియోగం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించి, భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకుని తమ గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు భూక్య సుబ్రహ్మణ్యం, శ్రీకాకుళపు శామ్యూల్ విద్యార్థులతో కలిసి కుటుంబ నాగేశ్వరరావు సేవాభావాన్ని అభినందించారు. స్వగ్రామ అభివృద్ధి కోసం ముందుకు వచ్చి విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులను అందించడం ఆదర్శప్రాయమని కొనియాడారు.

ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆనందాన్ని నింపడంతో పాటు, సమాజ సేవకు ఒక మంచి ఉదాహరణగా నిలిచింది.