BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

వరి కొయ్యలకు నిప్పు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం : ఎస్సై డి. నాగరాజు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
29 May, 2026 - 07:07 PM
208 వీక్షణలు

రైతు సోదరులు పొలాల్లో వరి కోతల అనంతరం మిగిలిన ఎండిన వరి కొయ్యలకు (రైస్ స్ట్రా) నిప్పు పెట్టవద్దని రామన్నపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్  డి. నాగరాజు గురువారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత వేసవి కాలంలో వేడి గాలులు తీవ్రంగా వీస్తున్నందున, పొలాల్లో పెట్టే మంటలు క్షణాల వ్యవధిలో విస్తరించే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్సై నాగరాజు మాట్లాడుతూ ఎండిన వరి కొయ్యలకు, ఇళ్ల సమీపంలో ఉన్న చెత్తాచెదరానికి నిప్పు పెట్టడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. వేడి గాలుల తీవ్రతకు మంటలు ఎగిసిపడి, పక్కనే ఉన్న గడ్డివాములకు, నివాస గృహాలకు అంటుకునే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. దీనివల్ల భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించే ముప్పు ఉందని, రైతులు, గ్రామస్థులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, చేతులారా ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని సూచించారు. ప్రకృతిని కాపాడితే అది మన ప్రాణాలను కాపాడుతుంది. మన గ్రామాన్ని పచ్చగా, సురక్షితంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత" అని ఆయన పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా వరి కొయ్యలకు నిప్పు పెడితే పర్యావరణ పరిరక్షణ చట్టం, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని  స్పష్టం చేశారు. గ్రామాల్లో ఇలాంటి ఉల్లంఘనలు జరిగితే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.