BREAKING
గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు
Date of Publish : 25 March 2026, 09:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వరంగల్ జిల్లాలో స్కానింగ్ సెంటర్ నిర్వాకం

తెలంగాణ
/ వరంగల్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 09:34 PM
155 వీక్షణలు

వరంగల్ జిల్లాలో స్కానింగ్ సెంటర్ నిర్వాకం – బాలికకు తప్పుడు గర్భ నిర్ధారణ రిపోర్ట్ కలకలం

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్‌లో తీవ్ర నిర్లక్ష్యం వెలుగుచూసింది. కడుపు నొప్పితో వచ్చిన చిన్నారి బాలికకు గర్భిణీగా ఉందని తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం స్థానికంగా కలకలం రేపింది.

ఈ రిపోర్ట్ చూసి షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు వెంటనే మరో నర్సింగ్ హోమ్‌లో పరీక్షలు చేయించగా, బాలికకు గర్భం లేదని, స్వల్ప ఆరోగ్య సమస్య మాత్రమే ఉందని వైద్యులు స్పష్టం చేశారు.

దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు సంబంధిత స్కానింగ్ సెంటర్‌కు వెళ్లి వైద్యుడిని నిలదీసి, దాడికి కూడా పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది.

ఇలాంటి తప్పుడు రిపోర్టులు కుటుంబాలను మానసికంగా కుదేలు చేస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఘటనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా, వైద్య నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విషయం సంబంధిత అధికారుల దృష్టికి చేరినట్లు సమాచారం. స్కానింగ్ సెంటర్‌పై విచారణకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనతో ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్ల పనితీరుపై మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.