BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

వరంగల్ జిల్లాలో స్కానింగ్ సెంటర్ నిర్వాకం

తెలంగాణ
/ వరంగల్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 09:34 PM
47 వీక్షణలు

వరంగల్ జిల్లాలో స్కానింగ్ సెంటర్ నిర్వాకం – బాలికకు తప్పుడు గర్భ నిర్ధారణ రిపోర్ట్ కలకలం

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్‌లో తీవ్ర నిర్లక్ష్యం వెలుగుచూసింది. కడుపు నొప్పితో వచ్చిన చిన్నారి బాలికకు గర్భిణీగా ఉందని తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం స్థానికంగా కలకలం రేపింది.

ఈ రిపోర్ట్ చూసి షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు వెంటనే మరో నర్సింగ్ హోమ్‌లో పరీక్షలు చేయించగా, బాలికకు గర్భం లేదని, స్వల్ప ఆరోగ్య సమస్య మాత్రమే ఉందని వైద్యులు స్పష్టం చేశారు.

దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు సంబంధిత స్కానింగ్ సెంటర్‌కు వెళ్లి వైద్యుడిని నిలదీసి, దాడికి కూడా పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది.

ఇలాంటి తప్పుడు రిపోర్టులు కుటుంబాలను మానసికంగా కుదేలు చేస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఘటనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా, వైద్య నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విషయం సంబంధిత అధికారుల దృష్టికి చేరినట్లు సమాచారం. స్కానింగ్ సెంటర్‌పై విచారణకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనతో ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్ల పనితీరుపై మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.