BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

వరంగల్ జిల్లాలో స్కానింగ్ సెంటర్ నిర్వాకం

తెలంగాణ
/ వరంగల్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 09:34 PM
110 వీక్షణలు

వరంగల్ జిల్లాలో స్కానింగ్ సెంటర్ నిర్వాకం – బాలికకు తప్పుడు గర్భ నిర్ధారణ రిపోర్ట్ కలకలం

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్‌లో తీవ్ర నిర్లక్ష్యం వెలుగుచూసింది. కడుపు నొప్పితో వచ్చిన చిన్నారి బాలికకు గర్భిణీగా ఉందని తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం స్థానికంగా కలకలం రేపింది.

ఈ రిపోర్ట్ చూసి షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు వెంటనే మరో నర్సింగ్ హోమ్‌లో పరీక్షలు చేయించగా, బాలికకు గర్భం లేదని, స్వల్ప ఆరోగ్య సమస్య మాత్రమే ఉందని వైద్యులు స్పష్టం చేశారు.

దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు సంబంధిత స్కానింగ్ సెంటర్‌కు వెళ్లి వైద్యుడిని నిలదీసి, దాడికి కూడా పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది.

ఇలాంటి తప్పుడు రిపోర్టులు కుటుంబాలను మానసికంగా కుదేలు చేస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఘటనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా, వైద్య నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విషయం సంబంధిత అధికారుల దృష్టికి చేరినట్లు సమాచారం. స్కానింగ్ సెంటర్‌పై విచారణకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనతో ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్ల పనితీరుపై మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.