BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

వసంత పంచమి, సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

తెలంగాణ
24 Jan, 2026 - 07:22 PM
203 వీక్షణలు
పలు పాఠశాలల్లో వసంత పంచమి, సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు NTODAY NEWS: చిట్యాల నల్లగొండ జిల్లా చిట్యాల పరిధిలోని గ్రీన్ గ్రోవ్, లోయోలా, గుండ్రంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం కార్యక్రమంతో పాటు సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్నారులు సరస్వతి వేషధారణలో అలంకరించుకొని ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ చదువుల తల్లి సరస్వతి దేవి ఆశీస్సులతో విద్యార్థులు విద్యలో రాణించి, ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. అలాగే సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో భారత జాతీయ సైన్యంతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసిన తీరును విద్యార్థులకు వివరించారు. గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ గ్రోవ్ పాఠశాల డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఏవో పోలా గోవర్ధన్, లోయోలా పాఠశాల చైర్మన్ ఎన్. సుందర్రాజు, ప్రిన్సిపల్ మహమ్మద్ జమీరుద్దీన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. #VasanthaPanchami #SubhasChandraBoseJayanti #Chityala #NalgondaDistrict #SchoolEvents #Aksharabhyasam #StudentActivities #EducationNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube