BREAKING
యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు
www.ntodaynews.com

వసంత పంచమి, సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

తెలంగాణ
24 Jan, 2026 - 07:22 PM
235 వీక్షణలు
పలు పాఠశాలల్లో వసంత పంచమి, సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు NTODAY NEWS: చిట్యాల నల్లగొండ జిల్లా చిట్యాల పరిధిలోని గ్రీన్ గ్రోవ్, లోయోలా, గుండ్రంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం కార్యక్రమంతో పాటు సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్నారులు సరస్వతి వేషధారణలో అలంకరించుకొని ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ చదువుల తల్లి సరస్వతి దేవి ఆశీస్సులతో విద్యార్థులు విద్యలో రాణించి, ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. అలాగే సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో భారత జాతీయ సైన్యంతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసిన తీరును విద్యార్థులకు వివరించారు. గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ గ్రోవ్ పాఠశాల డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఏవో పోలా గోవర్ధన్, లోయోలా పాఠశాల చైర్మన్ ఎన్. సుందర్రాజు, ప్రిన్సిపల్ మహమ్మద్ జమీరుద్దీన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. #VasanthaPanchami #SubhasChandraBoseJayanti #Chityala #NalgondaDistrict #SchoolEvents #Aksharabhyasam #StudentActivities #EducationNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube