BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

వసంత పంచమి, సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

తెలంగాణ
24 Jan, 2026 - 07:22 PM
287 వీక్షణలు
పలు పాఠశాలల్లో వసంత పంచమి, సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు NTODAY NEWS: చిట్యాల నల్లగొండ జిల్లా చిట్యాల పరిధిలోని గ్రీన్ గ్రోవ్, లోయోలా, గుండ్రంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం కార్యక్రమంతో పాటు సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్నారులు సరస్వతి వేషధారణలో అలంకరించుకొని ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ చదువుల తల్లి సరస్వతి దేవి ఆశీస్సులతో విద్యార్థులు విద్యలో రాణించి, ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. అలాగే సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో భారత జాతీయ సైన్యంతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసిన తీరును విద్యార్థులకు వివరించారు. గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ గ్రోవ్ పాఠశాల డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఏవో పోలా గోవర్ధన్, లోయోలా పాఠశాల చైర్మన్ ఎన్. సుందర్రాజు, ప్రిన్సిపల్ మహమ్మద్ జమీరుద్దీన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. #VasanthaPanchami #SubhasChandraBoseJayanti #Chityala #NalgondaDistrict #SchoolEvents #Aksharabhyasam #StudentActivities #EducationNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube