BREAKING
ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం హుజురాబాద్ కు సమీపంలోని వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్ట్ ను వెంటనే రద్దు చేయాలి ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం హుజురాబాద్ కు సమీపంలోని వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్ట్ ను వెంటనే రద్దు చేయాలి
www.ntodaynews.com

గ్రామ పరిశుభ్రత ప్రజలందరి బాధ్యత

తెలంగాణ
06 Mar, 2026 - 04:12 AM
128 వీక్షణలు
  గ్రామ పరిశుభ్రత ప్రజలందరి బాధ్యత: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి NTODAY NEWS: బొమ్మలరామారం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యక్రమంలో గ్రామాల పరిశుభ్రతకు ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు భాగస్వాములు కావాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శుక్రవారం బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి గ్రామంలో నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామంలో చేపట్టిన పారిశుధ్య పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామంలో పర్యటించిన కలెక్టర్ పరిశుభ్రత, పారిశుధ్య పనులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కాలనీలో చెత్త పేరుకుపోకుండా శుభ్రపరచాలని, మురికి కాల్వలు మరియు రోడ్ల ఇరువైపులా ఉన్న చెత్తను తొలగించాలని సూచించారు. గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని అన్నారు. ప్రజలకు శుద్ధమైన త్రాగునీరు అందించేందుకు వాటర్ ట్యాంక్‌లలో క్లోరినేషన్ చేయాలని, వాటిని ప్రతి నెల శుభ్రం చేయాలని ఆదేశించారు. అలాగే ఆర్థిక సంవత్సరానికి మార్చి నెల చివరి నెల కావడంతో ఇంటి పన్నుల వసూళ్లను పూర్తి చేసి క్లియర్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పి. శ్రీనివాస్ రావు, హౌసింగ్ పీడీ శ్రీ రాములు, ఇన్‌చార్జ్ ఎంపీడీవో గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బట్కీరు జ్యోతి బీరప్ప, గ్రామపంచాయతీ కార్యదర్శి నవీన్, ఉప సర్పంచ్ రామిడి దయాకర్ రెడ్డి, వార్డ్ మెంబర్లు గుజ్జ వెంకటేష్, హౌసింగ్ ఏఈ ప్రశాంత్, ప్రజా ప్రతినిధులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. #Bommalaramaram #NagineniPalli #AnuragJayanti #VillageSanitation #PrajaPalana #TelanganaNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube