BREAKING
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు లోత్తునూరులో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ స్వచ్ఛ సర్వేక్షన్ - స్వచ్ఛ నంద్యాల -కలెక్టర్ రాజకుమారిగనియా జిల్లా కలెక్టర్ ను కలసిన పుంగనూరు జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్... మార్కెట్ యార్డ్ స్థలం రైతులకు అంతా ఉపయోగకరంగా లేదు? నంద్యాల నడి బొడ్డున కోట్ల భూమి ఐఎంఏకు..!! యువత సైబర్ నేరాలు, బెట్టింగ్ మాయాజాలంలో పడవద్దు పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించిన కవిత ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఆక్రమణలపై కఠిన చర్యలు ఈ నెల 27న మంచిర్యాల జిల్లాలో ప్రజావాణి రద్దు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు లోత్తునూరులో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ స్వచ్ఛ సర్వేక్షన్ - స్వచ్ఛ నంద్యాల -కలెక్టర్ రాజకుమారిగనియా జిల్లా కలెక్టర్ ను కలసిన పుంగనూరు జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్... మార్కెట్ యార్డ్ స్థలం రైతులకు అంతా ఉపయోగకరంగా లేదు? నంద్యాల నడి బొడ్డున కోట్ల భూమి ఐఎంఏకు..!! యువత సైబర్ నేరాలు, బెట్టింగ్ మాయాజాలంలో పడవద్దు పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించిన కవిత ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఆక్రమణలపై కఠిన చర్యలు ఈ నెల 27న మంచిర్యాల జిల్లాలో ప్రజావాణి రద్దు
www.ntodaynews.com

నాగినేనిపల్లి గ్రామంలో నీటి కటకట, పట్టించుకోని అధికారులు

తెలంగాణ
18 May, 2025 - 08:28 AM
167 వీక్షణలు
నాగినేనిపల్లి గ్రామంలో నీటి కటకట, పట్టించుకోని అధికారులు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని నాగినేనిపల్లి గ్రామంలో కొద్ది రోజుల నుంచి మిషన్ భగీరథ నీరు సరఫరా లేకపోవడంతో గ్రామస్తులు తీవ్రఇబ్బంది పడుతున్నారు. బిందెడు నీటి కోసం అష్టకష్టాలు పడాల్సివస్తోందని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రైవేటు ట్యాంకర్లను తెప్పించుకుని ఇతర అవసరాలను తీర్చుకుంటున్నామని తెలిపారు. ట్యాంకర్ నుండి నీరు తెప్పించుకుంటున్నారంటే గ్రామంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పలు సార్లు మిషన్ భగీరథ అధికారులకు పంచాయితీ కార్యదర్శికి తమ సమస్యను విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కింద బస్తీలో సుమారు 60. కుటుంబాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా లేకపోవ డంతో తాగునీటి కోసం నానా తంటాలు పడుతున్నారు. భగీరథ నీటిసరఫరా నిలిచిపోతే గ్రామ పంచాయితీ నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి ఉండగా గ్రామపంచాయతీ సిబ్బంది పట్టించుకున్న పాపనా పోలేదు గత మూడు రోజుల నుంచి తాగునీరు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. ప్రైవేటు ట్యాంకర్లు తెప్పించుకుని అవసరాలు తీర్చు కోవాల్సివస్తోంది. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండ టంలేదు.సమస్య పరిష్కరించాల్సిన అధికారులు సమన్వయ లోపంతో సమస్య మరింత తీవ్రమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కింది బస్తీలో మూడు రోజుల నుంచి తాగునీరు సరఫరా కావడం లేదని పలుసార్లు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదు. బిందెడు నీటి కోసం పడరానిపాట్లు పడుతున్నాం అని ఆవేదన వ్యక్తంచేశారు ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కావడం లేదు మిషన్ భగీరథ,పంచాయతీ అధికారుల సమన్వయలోపం వలన తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి సత్వరమే పరిష్కారం చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. Follow us on Website Facebook Instagram YouTube