BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి

తెలంగాణ
24 Jan, 2026 - 08:16 PM
344 వీక్షణలు
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి తొర్రూరులో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం NTODAY NEWS: పాలకుర్తి నియోజకవర్గం రిపోర్టర్ వేణు రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తొర్రూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అధ్యక్షత వహించారు. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రనాయక్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమా మురళి నాయక్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ గత ప్రభుత్వ పదేళ్ల అహంకారాన్ని ప్రజలు కొద్ది రోజుల్లోనే తిప్పికొట్టారని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వానికి మరింత బలం చేకూరాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నట్లే పార్టీలో కూడా ఉంటాయని, వాటిని సరిదిద్దుకుని ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చిందని విమర్శించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. గతంలో ముఖ్యమంత్రిని కలవాలంటే మంత్రులకు కూడా అపాయింట్‌మెంట్ దొరకని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు సామాన్యులకు కూడా సీఎం అపాయింట్‌మెంట్ లభిస్తోందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాంగ్రెస్ మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మినీ స్టేడియం కోసం వినతి అనంతరం పాలకుర్తి నియోజకవర్గంలో మినీ స్టేడియం మంజూరు చేయాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరికి వినతిపత్రం అందించారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి మినీ స్టేడియం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #Palakurthi #Thorrur #CongressParty #MunicipalElections #PoliticalMeeting #TelanganaPolitics #CongressLeaders #MiniStadium #PublicGovernment #LocalBodyElections Follow us on Website Facebook Instagram YouTube