www.ntodaynews.com
దురహంకార దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
తెలంగాణ
బిసిల పై అగ్ర కుల దురహంకార దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
-హిందూ బిసి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుముల నవీన్ కుమార్
NTODAY NEWS: నల్లగొండ జిల్లా
బిసి కులస్థులైన రజకులపై అగ్ర కుల దురహంకార దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని హిందూ బిసి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుముల నవీన్ కుమార్ అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ, నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో మూడు రోజుల క్రితం టికెట్ లేకుండా గుడిలోని ప్రవేశించారనే నెపంతో కుల దురహంకారంతో అదే గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ తుకారాం రెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధు రెడ్డి మరియూ రెడ్డి కులస్తులంతా రాయలేని భాషలో బండ బూతులు తిడుతూ అతి భయంకరంగా వారిపై దాడి చేయడంతో పాటు రెండు నెలల పసిబిడ్డ ని కాలితో తన్ని చంపారు. వెంటనే నిందితులపై మర్డర్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబానికి అగ్ర కుల దురహంకారులతో ప్రాణభయం ఉండటంతో జిల్లా ఎస్పీ మరియు కలెక్టర్ వారికి తగిన భద్రత కల్పించాలని మరియు తగు నష్టపరిహారం చెల్లించి అగ్ర కుల దురహంకారుల చేతిలో గాయపడిన వారికి తక్షణమే వైద్య సదుపాయం కల్పించాలని హిందూ బిసి హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తోంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు విజయ్ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మంగ శివకుమార్ మరియు జిల్లా కార్యవర్గం పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube