www.ntodaynews.com
ప్రభుత్వ సంక్షేమ పథకాలు సంచార జాతి ప్రజలకు అందిస్తాం
తెలంగాణ
ప్రభుత్వ సంక్షేమ పథకాలు సంచార జాతి ప్రజలకు అందిస్తాం;;; యాదాద్రి జిల్లా కలెక్టర్
NTODAY NEWS: హైదరాబాద్
తెలంగాణ ఎంబీసీ కార్పొరేషన్ సీఈవో అలోకే కుమార్ . సహకారంతో మరియు సంచార జాతుల మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు కోట అనిత ఎల్లమ్మ సహకారంతో తాజ్పూరులో నివసిస్తున్న సంచార జాతి అయిన పెద్దమ్మలవాండ్ల సమస్యల గురించి యాదాద్రి జిల్లా కలెక్టర్ ఎం .హనుమంతరావు ని కలిసి ఇంటి స్థలాలు లేని కుటుంబాలకు ఇంటి స్థలాలు కేటాయించాలని తాజ్పూర్ పెద్దమ్మలవాన్ల మహిళలతో వినతి పత్రం సమర్పించడం జరిగినది. కలెక్టర్ సానుకూలంగా స్పందించి మీ సంచార జాతి వారికి ఇంక్వైరీ చేయకుండానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇస్తాం .మొట్టమొదట ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకానికి మీ సంచార జాతి ప్రజలే అర్హులవుతారు కానీ మీ యొక్క జాతుల తరపున మా ప్రభుత్వ అధికారుల వద్దకి వినతి పత్రాలు అందటం లేదు మరియు మీ జాతుల పిల్లలను విద్య అభ్యసించే విధంగా కోట అనిత కృషి చేయాలని ఇప్పటికీ సంచారజాతులలో ఎవరైనా చదువుకొని ఉంటే వారిని కంప్యూటర్ కోర్సు నేర్చుకోవడం వల్ల చాలా ఉద్యోగ అవకాశాలు అందుతాయి .ఉచితంగా స్వచ్ఛంద సంస్థలు కూడా కంప్యూటర్ నేర్పిస్తున్నారు మీ జాతి ప్రజలు తప్పకుండా కంప్యూటర్ కోర్స్ నేర్చుకొని ఉండాలి .దీని వలన ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి మరియు సంచార జాతుల కుటుంబాలకు ఇంటి స్థలాలను కేటాయిస్తాం .పెద్దమ్మల వాన్ల మహిళలకు కలెక్టర్ తెలియజేయడం జరిగినది .ఈ కార్యక్రమంలో నాయకురాళ్లు కోట విజయ .ఎం వెన్నెల. డి యమునా. మరియు కోటమీనా .కోటరాద. కోట మంజుల. డి రేణుక .వి మైసమ్మ. కోట లక్ష్మి. తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube