BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 12 September 2025, 10:45 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

సింగరేణి లాభాల్లో కార్మికులకు 35 శాతానికిపైగా వాటా ఇవ్వాలి

తెలంగాణ
12 Sep, 2025 - 10:45 PM
369 వీక్షణలు
సింగరేణి లాభాల్లో కార్మికులకు 35 శాతానికిపైగా వాటా ఇవ్వాలి NTODAY NEWS: హైదరాబాద్. అలియాస్ పేర్ల కార్మికుల సమస్యలు మానవతాదృక్పదంతో పరిష్కరించాలి వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలి సింగరేణి సీఎండీని కోరిన హెచ్ ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సింగరేణి సంస్థ లాభాల్లో కార్మికులకు 35 శాతానికిపైగా వాటా ఇవ్వాలని, దసరాకు ముందే బోనస్ కార్మికులకు అందజేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్, కార్మిక నాయకులు, కార్మిక కుటుంబాలతో సింగరేణి సీఎండీ బలరాం నాయక్ ను కలిసి పలు సమస్యల పై మెమోరాండం ఇచ్చారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ, అలియాస్ పేర్లతో ఉద్యోగంలో చేరిన నలుగురు కార్మికులను డిస్మిస్ చేయడం దారుణమని వారికి ఉద్యోగాలు తిరిగి ఇవ్వాలని కోరామన్నారు. మెడికల్ బోర్డు వల్ల నష్టపోయిన 54 మంది కార్మికుల వారసుల కోసం రీ మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరామన్నారు. అలాగే గతంలో మాదిరిగా నెలకు రెండు సార్లు మెడికల్ బోర్డు నిర్వహించాలని కోరారు. పదో తరగతి పాస్ కాలేదనే సాకుతో పెండింగులో పెట్టిన ఉద్యోగాలను వెంటనే ఇవ్వాలి అని ఎలాంటి చదువు లేకున్నా డిపెండెంట్లకు ఉద్యోగలు ఇవ్వాలని కొరమని చెప్పామన్నారు. పెండింగ్ లో ఉన్న క్లరికల్ పరీక్ష నిర్వహించాలి అని పరీక్షకు సిద్ధం అయినా అభ్యర్థులకు న్యాయం చేయాలి. నిమ్స్ టారిఫ్ పేరిట నాణ్యమైన వైద్యం అందలేకపోతుంది దీని స్థానంలో CGHS పాలసీ అమలు చేసి కార్మికులకు నాణ్యమైన వైద్యం అందించాలి. భూనిర్వాసితులకు కంపెనీ లో ఉద్యోగం ఇచ్చే విధంగా పాలసీ చేయాలి అని కోరారు గతంలో 600 మంది భూ నిర్వాసితులకు ఉద్యోగ అవకాశం కల్పించిన విధంగా ఇతరులకు కూడా ఉద్యోగం ఇవ్వాలి.190/240 నిండిన బదిలీ వర్కర్లను జనరల్ అసిస్టెంట్ గా రెగ్యులరైజ్ చేయాలి.పెర్క్స్ అలవెన్సు పై టాక్స్ రద్దు చేయాలి. ప్రతి ఏరియాలో CBSE స్కూల్స్ ఏర్పాటు చేయాలి తాము లేవనెత్తిన అంశాలను పరిష్కరిస్తామని సీఎండీ హామీ ఇచ్చారని తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube