www.ntodaynews.com
యనమలకుదురు ఆలయ అధికారుల అరెస్ట్
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
యనమలకుదురు ఆలయ అధికారుల అరెస్ట్
విజయవాడ సమీపంలోని యనమలకుదురు శివాలయంలో రూ.10 లక్షల నగదు గోల్మాల్ వెలుగుచూసింది. ఆలయ ఈవో భవానీ, అర్చకులు కుమ్మక్కై నిధులను అక్రమంగా దారి మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ ఘటనలో ప్రధాన పూజారి సాగర్, ఉద్యోగి పూర్ణ రోశయ్యలను పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈవో భవానీ పరారీలో ఉన్నట్లు సమాచారం.
ఈ విషయంపై దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత స్పందిస్తూ, గత ఐదేళ్ల ఆర్థిక లావాదేవీల రికార్డులను సమగ్రంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. 15 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు.