BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

యూపీ బస్సు ప్రమాదం.. పల్నాడు యాత్రికుల కోసం జిల్లా యంత్రాంగం అప్రమత్తం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 May, 2026 - 01:23 PM
91 వీక్షణలు

యూపీ బస్సు ప్రమాదం.. పల్నాడు యాత్రికుల కోసం జిల్లా యంత్రాంగం అప్రమత్తం

ఉత్తరప్రదేశ్‌లోని సితాపూర్ సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ యాత్రికులను సురక్షితంగా స్వగ్రామాలకు చేర్చేందుకు పల్నాడు జిల్లా యంత్రాంగం ముమ్మర చర్యలు చేపట్టింది. ప్రమాదానికి గురైన బస్సులో నరసరావుపేట, చిలకలూరిపేట ప్రాంతాలకు చెందిన 61 మంది యాత్రికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, స్వల్ప గాయాలతో బయటపడిన నలుగురికి లక్నో ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. మిగతా యాత్రికులందరినీ లక్నోలోని ఆనంద్ ఆశ్రమంలో సురక్షితంగా ఉంచి, అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు.

బాధితులను వీలైనంత త్వరగా రాష్ట్రానికి తరలించేందుకు పల్నాడు జిల్లా అధికారులు ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తున్నారు. యాత్రికుల పూర్తి వివరాలను ఇప్పటికే ఏపీ భవన్ సిబ్బందికి అందజేసి, రవాణా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఇక ప్రమాద సమాచారం తెలుసుకునేందుకు, బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు జిల్లా కలెక్టరేట్‌లో 24 గంటల ప్రత్యేక హెల్ప్‌లైన్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ సూపరింటెండెంట్ నాగిరెడ్డి పర్యవేక్షణలో పనిచేస్తున్న 9154959291 నంబర్‌ను సంప్రదించి సమాచారం పొందవచ్చని జిల్లా యంత్రాంగం వెల్లడించింది.

ఈ ఘటనతో పల్నాడు జిల్లాలో ఆందోళన నెలకొనగా, యాత్రికుల సురక్షిత రాక కోసం కుటుంబ సభ్యులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.