BREAKING
ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి
www.ntodaynews.com

యూపీఎస్సీలో 50వ ర్యాంక్‌తో ఐఎఫ్‌ఎస్ సాధించిన జయ అశ్వంత్ రెడ్డికి ఘన సత్కారం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 04:31 PM
97 వీక్షణలు

విజయవాడ: యూపీఎస్సీ పరీక్షల్లో ప్రతిభ చాటుతూ 50వ ర్యాంక్ సాధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్)కు ఎంపికైన జయ అశ్వంత్ రెడ్డిని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ప్రత్యేకంగా అభినందించారు.

ఎన్టీఆర్ జిల్లాలో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న బండి ఉమా మహేశ్వర రెడ్డి, వందన దంపతుల కుమారుడు జయ అశ్వంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన యూపీఎస్సీ ఫలితాల్లో ఆల్ ఇండియా 50వ ర్యాంక్ సాధించి ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జయ అశ్వంత్ రెడ్డిని దుశ్శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

అలాగే, తన కుమారుడి విజయానికి కృషి చేసిన తల్లిదండ్రులు బండి ఉమా మహేశ్వర రెడ్డి, వందనలను కూడా కమిషనర్ ప్రశంసించారు. కర్నూలులో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన జయ అశ్వంత్ రెడ్డి, హైదరాబాద్‌లో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదివి సివిల్స్‌కు సిద్ధమవుతూ ఈ ఘన విజయాన్ని సాధించారు.

ఈ సందర్భంగా అడ్మిన్ డీసీపీ కె.జి.వి. సరిత కూడా జయ అశ్వంత్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ సరిత, ఏసీపీ ఉమా మహేశ్వర రెడ్డి, వందన తదితరులు పాల్గొన్నారు.

కృషి, పట్టుదల ఉంటే లక్ష్యం ఎంత పెద్దదైనా సాధించవచ్చని జయ అశ్వంత్ రెడ్డి మరోసారి నిరూపించారని పోలీసు అధికారులు కొనియాడారు.