www.ntodaynews.com
యర్రవారిగూడెంలో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం ఎర్రవారిగూడెంలో ఆదివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. ఇంటి యజమాని చాగంటి నరసింహారావు కుటుంబ సభ్యులతో కలిసి వివాహానికి వెళ్లిన సమయంలో దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న ఏడు కాసుల బంగారు నగలను అపహరించి పరారయ్యారు.
సమాచారం అందుకున్న ఎస్సై రామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.