14న శ్రీ మాణిక్య వరదరాజస్వామి ఆలయంలో కలశ ప్రతిష్ఠాపన మహోత్సవం...
14న శ్రీ మాణిక్య వరదరాజస్వామి ఆలయంలో కలశ ప్రతిష్ఠాపన మహోత్సవం...
అన్నమయ్య జిల్లా.
పుంగనూరు.
పుంగనూరు, ఆగస్టు 6 (ఉత్తరాది ఎక్స్ప్రెస్): పుంగనూరు పట్టణంలోని నగరి వీధిలో జమీందారులచే నిర్మించబడిన శ్రీ మాణిక్య వరదరాజస్వామి ఆలయ నూతన రాజగోపురం కలశ ప్రతిష్ఠాపన ప్రారంభోత్సవం ఈనెల 14న వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు.
గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు నాలుగు రోజులపాటు ఆలయంలో ఆగమశాస్త్ర విధానంలో విశేష పూజలు, హోమాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ మహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ మాణిక్య వరదరాజస్వామి వారి అనుగ్రహాన్ని పొందాలని ఆయన కోరారు. ఆలయ రాజగోపురానికి కలశ ప్రతిష్ఠాపన జరగడం ఆలయ చరిత్రలో ఒక విశిష్ట ఘట్టమని పేర్కొన్నారు. భక్తులందరూ ఈ పవిత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దేవస్థాన అధికారులు విజ్ఞప్తి చేశారు.
J. ఏకాంబరం, B.A.,
కార్యనిర్వహాణాధికారి & ఉప కమీషనరు
శ్రీ మాణిక్య వరదరాజ స్వామి దేవస్థానము, పుంగనూరు (T & M), అన్నమయ్య జిల్లా
ఆలయ సిబ్బంది
శ్రీ ఎ. పార్థసారధి
ఆలయ ప్రధాన అర్చకులు
శ్రీ ఎ.ఎస్. క్రిష్ణమాచార్యులు
సహాయ అర్చకులు
శ్రీ ఎ.ఎస్. శ్యామసుందరాచార్యులు
శ్రీ ఎ.ఎస్. హేమంత్కుమార్ చార్యులు
శ్రీ ఎ.ఎస్. సాయిప్రకాష్ చార్యులు