BREAKING
జిల్లాలో మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు ప్రభుత్వం రైతులను ఇబ్బందులు చేయకుండా మండలంలోని వరి ధాన్యం కొనుగోలు వేగం పెంచాలి ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరుగుతోంది – పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక మహిళా ఉద్యోగుల భద్రతే మా లక్ష్యం మంచిర్యాల: గొంతులో ఇరుక్కున్న మటన్ ఎముక.. పోతనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి రూ.10,000 సాయం – విద్యార్థి పట్టుదలకు అభినందనలు శ్రీరామవరం గ్రామంలో కోడిపందెంపై పోలీసుల దాడి..అదుపులో ఏడుగురు మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి – నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ జిల్లాలో మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు ప్రభుత్వం రైతులను ఇబ్బందులు చేయకుండా మండలంలోని వరి ధాన్యం కొనుగోలు వేగం పెంచాలి ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరుగుతోంది – పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక మహిళా ఉద్యోగుల భద్రతే మా లక్ష్యం మంచిర్యాల: గొంతులో ఇరుక్కున్న మటన్ ఎముక.. పోతనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి రూ.10,000 సాయం – విద్యార్థి పట్టుదలకు అభినందనలు శ్రీరామవరం గ్రామంలో కోడిపందెంపై పోలీసుల దాడి..అదుపులో ఏడుగురు మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి – నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
www.ntodaynews.com

44 జాతీయ పక్షులు మృతి.. కర్ణాటకలో హై అలర్ట్

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 May, 2026 - 01:22 PM
24 వీక్షణలు

44 జాతీయ పక్షులు మృతి.. కర్ణాటకలో హై అలర్ట్

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో జాతీయ పక్షి అయిన నెమలిల వరుస మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పచ్చని పొలాల్లో కనువిందు చేయాల్సిన నెమళ్లు ఒక్కసారిగా విగతజీవులుగా మారడం స్థానికులను కలవరపెడుతోంది.

ఇప్పటివరకు 44 నెమళ్లు మృతి చెందగా, వీటి మరణాలకు కారణం H5N1 బర్డ్ ఫ్లూ అని ల్యాబ్ పరీక్షల్లో నిర్ధారణ అయింది. ఈ వైరస్ వేగంగా వ్యాపించే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించి, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. పక్షుల సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలను పర్యవేక్షిస్తూ, మృత పక్షుల నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మృత పక్షులను తాకకుండా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతున్నాయి.