BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

44 జాతీయ పక్షులు మృతి.. కర్ణాటకలో హై అలర్ట్

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 May, 2026 - 01:22 PM
109 వీక్షణలు

44 జాతీయ పక్షులు మృతి.. కర్ణాటకలో హై అలర్ట్

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో జాతీయ పక్షి అయిన నెమలిల వరుస మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పచ్చని పొలాల్లో కనువిందు చేయాల్సిన నెమళ్లు ఒక్కసారిగా విగతజీవులుగా మారడం స్థానికులను కలవరపెడుతోంది.

ఇప్పటివరకు 44 నెమళ్లు మృతి చెందగా, వీటి మరణాలకు కారణం H5N1 బర్డ్ ఫ్లూ అని ల్యాబ్ పరీక్షల్లో నిర్ధారణ అయింది. ఈ వైరస్ వేగంగా వ్యాపించే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించి, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. పక్షుల సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలను పర్యవేక్షిస్తూ, మృత పక్షుల నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మృత పక్షులను తాకకుండా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతున్నాయి.