44 జాతీయ పక్షులు మృతి.. కర్ణాటకలో హై అలర్ట్
44 జాతీయ పక్షులు మృతి.. కర్ణాటకలో హై అలర్ట్
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో జాతీయ పక్షి అయిన నెమలిల వరుస మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పచ్చని పొలాల్లో కనువిందు చేయాల్సిన నెమళ్లు ఒక్కసారిగా విగతజీవులుగా మారడం స్థానికులను కలవరపెడుతోంది.
ఇప్పటివరకు 44 నెమళ్లు మృతి చెందగా, వీటి మరణాలకు కారణం H5N1 బర్డ్ ఫ్లూ అని ల్యాబ్ పరీక్షల్లో నిర్ధారణ అయింది. ఈ వైరస్ వేగంగా వ్యాపించే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించి, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. పక్షుల సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలను పర్యవేక్షిస్తూ, మృత పక్షుల నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మృత పక్షులను తాకకుండా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతున్నాయి.