www.ntodaynews.com
టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షులుకు ఘన సన్మానం
తెలంగాణ
టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షులు వోడ్నాల రాజశేఖర్కు ఘన సన్మానం
తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ చేతుల మీదుగా అభినందన NTODAY NEWS: జగిత్యాల తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) రాష్ట్ర అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన వోడ్నాల రాజశేఖర్ను జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఘనంగా సన్మానించారు. శుక్రవారం జగిత్యాలలోని ఆమె నివాసంలో రాజశేఖర్ మర్యాదపూర్వకంగా కలవగా, శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
మున్నూరు కాపు విద్యవంతుల వేదిక ఆధ్వర్యంలో సత్కారం
అనంతరం జగిత్యాల మున్నూరు కాపు విద్యవంతుల వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజశేఖర్ను మున్నూరు కాపు మేధావులు, విద్యావేత్తలతో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ— జగిత్యాల జిల్లాకు చెందిన వ్యక్తి రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం గర్వకారణమని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో రాజశేఖర్ ముందుండాలని ఆకాంక్షించారు.
పాల్గొన్న ముఖ్య నేతలు
ఈ కార్యక్రమంలో టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సాసాల మల్లికార్జున్, జిల్లా అధ్యక్షుడు తీగల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొత్త నరేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి తులసి లైశెట్టి వెంకన్న, గోపాల్, కొలగాని మహేష్, అరిగెల మహిపాల్, నీలం సంపత్, తీగల సూర్యప్రసాద్, కాశెట్టి రమేష్, తీగల వెంకన్న, కాసెట్టి శ్రీనివాస్, చెట్పెల్లి సత్తన్న, చుక్క మల్లికార్జున్, తోట మల్లికార్జున్, కొలగని మధు, బొడ్డు ప్రవీణ్, అత్తినేని శ్రీనివాస్ రావు, మిడి రాజేందర్, గాదే అశోక్, జున్ను రాజేందర్, సంతోష్, నాగరాజు, శీలం తిరుపతి, బక్క శెట్టి తిరుపతి, దొనకంటి కిరణ్, సాయిని శ్రీనివాస్, తీగల సంకీర్తన్, సాత్విక్, శీలం రాజు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#TPUS
#TeachersUnion
#TeacherLeadership
#Jagtial
#TelanganaTeachers
#EducationCommunity
#LeadershipRecognition
Follow us on
Website
Facebook
Instagram
YouTube 