లక్ష్మీనగర్ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి
NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్ కుమార్.
ఏలూరు జిల్లా టిడిపి రథసారధిగా నూతనంగా నియమితులైన జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యని లక్ష్మీ నగర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు, కమిటీ అధ్యక్షుడు న్యాయవాది గొల్లపల్లి మురళి ఆధ్వర్యంలో కలసి అభినందనలు తెలియజేశారు .అనంతరం లక్ష్మీనగర్ లోని పలు రోడ్ల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించి త్వరలోనే లక్ష్మీనగర్ లోని అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చినారు అంతేకాక దశబ్దాల చరిత్ర కలిగిన రామయ్య కోనేరు ఎలాంటి అభివృద్ధికి నోచుకోక పిచ్చి మొక్కలు మొలిచి పందులకు ఆవాసగా మారినది అని రామయ్యా కోనేరు చుట్టు పక్కల నివాసాలు ఏర్పడి జనసంఖ్య పెరిగినది అందువలన రామయ్యా కోనేరు ను డెవలప్ చేసి పార్కు గా తీర్చి దిద్ది దాని నిర్వహణ స్థానికులైన లక్ష్మీ నగర్ వాసులకు అప్ప చెప్పమని కోరడమైనది. అందుకు సానుకూలం గా స్పందించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య గారు గతంలో లీజుకు తీసుకున్న వ్యక్తి గడువు ముగియ గానే తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అందుకు లక్ష్మీ నగర్ వాసులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube