www.ntodaynews.com
ఘనంగా A1 సెంట్రల్ బిర్యానీ మెస్ ప్రారంభం
తెలంగాణ
పాలకుర్తిలో A1 సెంట్రల్ బిర్యానీ మెస్ & మండి బిర్యానీ ప్రారంభం
NTODAY NEWS: పాలకుర్తి రిపోర్టర్ వేణు
పాలకుర్తి పట్టణంలోని రాజీవ్ చౌరస్తా సమీపంలో అంగోత్ శ్రీనివాస్ నూతనంగా ఏర్పాటు చేసిన A1 సెంట్రల్ బిర్యానీ మెస్ & మండి బిర్యానీను పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా యజమానులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి కొత్త వ్యాపారాలు పట్టణ అభివృద్ధికి తోడ్పడతాయని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని ఆమె పేర్కొన్నారు. ప్రజలకు రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందిస్తూ వ్యాపారం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి రాఘవరావు, పట్టణ అధ్యక్షుడు నాగన్న, స్థానిక నాయకులు, వ్యాపారులు, వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ కార్యకర్తలు మరియు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube