BREAKING
కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి ఏబీవీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు నలిమెల సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు టీడీపీ నాయకుడిపై 5వ తరగతి విద్యార్థినిని వేధించినట్లు ఆరోపణలు.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వడ్ల సత్యనారాయణ.. ప్రధాన కార్యదర్శిగా బీ. దత్తు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక చిలకలూరిపేట నుండి మంగళగిరి ఎయిమ్స్ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి.. అభినవ వివేకానందుడు ఆచార్య కసిరెడ్డి పూర్వ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి.... కేంద్రీకృత వంటశాల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చిన్నారి వసుమనాస్ కార్తికేయ జన్మదినం సందర్భంగా బసవతారకం ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత – ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి ఏబీవీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు నలిమెల సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు టీడీపీ నాయకుడిపై 5వ తరగతి విద్యార్థినిని వేధించినట్లు ఆరోపణలు.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వడ్ల సత్యనారాయణ.. ప్రధాన కార్యదర్శిగా బీ. దత్తు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక చిలకలూరిపేట నుండి మంగళగిరి ఎయిమ్స్ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి.. అభినవ వివేకానందుడు ఆచార్య కసిరెడ్డి పూర్వ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి.... కేంద్రీకృత వంటశాల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చిన్నారి వసుమనాస్ కార్తికేయ జన్మదినం సందర్భంగా బసవతారకం ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత – ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే
www.ntodaynews.com

ఆధార్ సేవలు ఇక మరింత సులభం.. ఆన్‌లైన్‌లోనే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకునే అవకాశం!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Aug, 2026 - 09:05 PM
15 వీక్షణలు

ఆధార్ సేవలు ఇక మరింత సులభం.. ఆన్‌లైన్‌లోనే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకునే అవకాశం!

కొత్త ఆధార్ నమోదు చేయించుకోవాలన్నా, ఆధార్‌లో పేరు, చిరునామా, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ, బయోమెట్రిక్ వివరాలు వంటి మార్పులు చేయించుకోవాలన్నా ఇకపై ఆధార్ కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. భారత ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా ఉచితంగా ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ విధానం ద్వారా ముందుగానే తేదీ, సమయాన్ని ఎంపిక చేసుకుని అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. నిర్ణయించిన సమయానికి సంబంధిత ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి సేవలు పొందవచ్చు. దీంతో క్యూల్లో వేచి ఉండే సమయం తగ్గడంతో పాటు సేవలు కూడా వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది.

యూఐడీఏఐ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి నెలకు గరిష్టంగా రెండు అపాయింట్‌మెంట్లు మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అపాయింట్‌మెంట్ బుకింగ్‌కు ఎలాంటి అదనపు రుసుము ఉండదు. అయితే ఆధార్ నమోదు లేదా వివరాల సవరణకు వర్తించే సేవా ఛార్జీలు యథావిధిగా అమల్లో ఉంటాయి.

దేశవ్యాప్తంగా ఆధార్ సేవా కేంద్రాలు సాధారణంగా ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పనిచేస్తాయి. ముందస్తు అపాయింట్‌మెంట్‌తో వెళ్లే వారికి సేవలు మరింత సులభంగా, వేగంగా అందేలా ఈ కొత్త సౌకర్యం ఉపయోగపడనుంది.