ఉత్తరాఖండ్లో రోబోటిక్ డాగ్స్తో భారత్–అమెరికా సైనిక విన్యాసాలు
జాతీయం
జాతీయం
ఉత్తరాఖండ్: 2026 యుద్ధ్ అభ్యాస్ సంయుక్త సైనిక విన్యాసాల్లో భాగంగా ఉత్తరాఖండ్లోని ఔలీలో భారత, అమెరికా సైనిక బలగాలు కౌంటర్ టెర్రరిజం బిల్డింగ్ క్లియరెన్స్ డ్రిల్ నిర్వహించాయి.
ఈ విన్యాసాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ డ్రోన్లు, రోబోటిక్ డాగ్స్, ఆర్మీ శునకాలు, స్నైపర్ల సహకారంతో అసాల్ట్ టీమ్స్ ఆపరేషన్ చేపట్టాయి. భవనాల్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లను సమర్థవంతంగా నిర్వహించే విధానాలను ఈ డ్రిల్లో ప్రదర్శించారు.
అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల్లో భారత, అమెరికా బలగాల మధ్య సమన్వయం, పరస్పర సహకారం, ఆధునిక సాంకేతిక పరికరాల వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించడమే ఈ సంయుక్త విన్యాసాల ప్రధాన లక్ష్యంగా అధికారులు పేర్కొన్నారు.