BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

ఆగస్టు 1 నుంచి తక్కువ ధరకే బియ్యం.. ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ శుభవార్త!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jul, 2026 - 10:44 AM
18 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో బియ్యం ధరలు పెరిగి సామాన్యులకు భారం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించిన వివరాల ప్రకారం, ఆగస్టు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 500 రైస్ మిల్లుల అవుట్‌లెట్లు, 130 రైతు బజార్లలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి తక్కువ ధరకే బియ్యం విక్రయించనున్నారు.

ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ఇవి:

సూపర్ ఫైన్ స్టీమ్ రైస్ – కేజీ రూ.52

బీపీటీ గ్రేడ్-1 – కేజీ రూ.50

బీపీటీ గ్రేడ్-2 – కేజీ రూ.48

ప్రస్తుతం మార్కెట్లో సూపర్ ఫైన్ స్టీమ్ రైస్ రూ.62–65, బీపీటీ గ్రేడ్-1 రూ.55–58 వరకు విక్రయమవుతుండగా, ప్రభుత్వ నిర్ణయంతో వినియోగదారులకు కిలోపై రూ.10 వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న ధరలను నియంత్రించి, నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరల్లో ప్రజలకు అందించడమే ఈ నిర్ణయం లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.