BREAKING
కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి ఏబీవీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు నలిమెల సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు టీడీపీ నాయకుడిపై 5వ తరగతి విద్యార్థినిని వేధించినట్లు ఆరోపణలు.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వడ్ల సత్యనారాయణ.. ప్రధాన కార్యదర్శిగా బీ. దత్తు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక చిలకలూరిపేట నుండి మంగళగిరి ఎయిమ్స్ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి.. అభినవ వివేకానందుడు ఆచార్య కసిరెడ్డి పూర్వ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి.... కేంద్రీకృత వంటశాల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చిన్నారి వసుమనాస్ కార్తికేయ జన్మదినం సందర్భంగా బసవతారకం ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత – ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి ఏబీవీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు నలిమెల సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు టీడీపీ నాయకుడిపై 5వ తరగతి విద్యార్థినిని వేధించినట్లు ఆరోపణలు.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వడ్ల సత్యనారాయణ.. ప్రధాన కార్యదర్శిగా బీ. దత్తు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక చిలకలూరిపేట నుండి మంగళగిరి ఎయిమ్స్ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి.. అభినవ వివేకానందుడు ఆచార్య కసిరెడ్డి పూర్వ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి.... కేంద్రీకృత వంటశాల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చిన్నారి వసుమనాస్ కార్తికేయ జన్మదినం సందర్భంగా బసవతారకం ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత – ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే
www.ntodaynews.com

ఆగస్టు 15 నుంచి గిగ్ వర్కర్లకు గుడ్‌న్యూస్.. సంక్షేమ బోర్డు సేవలు ప్రారంభం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Aug, 2026 - 08:56 PM
13 వీక్షణలు

ఆగస్టు 15 నుంచి గిగ్ వర్కర్లకు గుడ్‌న్యూస్.. సంక్షేమ బోర్డు సేవలు ప్రారంభం

తెలంగాణలో గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఆగస్టు 15 నుంచి గిగ్ వర్కర్ల సంక్షేమ బోర్డు సేవలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఈ నిర్ణయంతో డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, లాజిస్టిక్స్ సిబ్బందితో పాటు యాప్ ఆధారిత సేవలు అందించే సుమారు 5 లక్షల మంది గిగ్ వర్కర్లు ప్రయోజనం పొందనున్నారు.

ఈ చట్టం అమల్లో భాగంగా ప్రతి గిగ్ వర్కర్‌కు ప్రత్యేక యూనిక్ ఐడీ జారీ చేయనున్నారు. అలాగే అగ్రిగేటర్ సంస్థలు ప్రతి లావాదేవీపై 1 నుంచి 2 శాతం వరకు వెల్ఫేర్ ఫీజును గిగ్ వర్కర్ల సంక్షేమ బోర్డుకు జమ చేయాల్సి ఉంటుంది. ఈ నిధులను వర్కర్ల సంక్షేమం, భద్రత, సామాజిక రక్షణ చర్యలకు వినియోగించనున్నారు.

నిబంధనలను ఉల్లంఘించే అగ్రిగేటర్ సంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. తొలి ఉల్లంఘనకు రూ.50 వేల వరకు జరిమానా విధించగా, అదే తప్పు మళ్లీ చేస్తే జరిమానా ఐదు రెట్ల వరకు పెంచే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి నిబంధనలు, మార్గదర్శకాలను ప్రభుత్వం ఖరారు చేసినట్లు వెల్లడించింది.

ఈ నిర్ణయంతో ఇప్పటివరకు సామాజిక భద్రతకు దూరంగా ఉన్న గిగ్ వర్కర్లకు చట్టబద్ధమైన రక్షణ, సంక్షేమ ప్రయోజనాలు అందే అవకాశాలు మరింత బలపడనున్నాయి.