BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

​ఆహార భద్రతా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి: జిల్లా ఆహార భద్రత అధికారి జి.మహేష్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
07 Jun, 2026 - 06:36 PM
89 వీక్షణలు

మంచిర్యాల ప్రతినిధి: జిల్లాలోని హోటళ్ళు, స్వీట్ షాపులు, బేకరీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ఆహార భద్రతా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఆహార భద్రత శాఖ అధికారి జి.మహేష్ పిలుపునిచ్చారు. ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని నార్త్ ఇన్ హోటల్ లో వ్యాపార నిర్వాహకులకు ఒక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆహార భద్రత శాఖ డిజిగ్నేటెడ్ అధికారి బి. వాసు రామ్ తో కలిసి ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఎలాంటి ఆహార ఉత్పత్తులను తయారు చేయకూడదని హెచ్చరించారు. ఆహార పదార్థాల తయారీలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ, కేవలం తాజా నిత్యావసర సరుకులను మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు.

​ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించిందని, కాబట్టి నిర్వాహకులందరూ ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించాలని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఆహార భద్రత శాఖ ఆధ్వర్యంలో వ్యాపార సంస్థలపై నిరంతర తనిఖీలు ఉంటాయని, నిబంధనలు ఉల్లంఘించి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ అవగాహన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కేంద్రంలోని వివిధ హోటళ్ళు, స్వీట్ షాపులు, బేకరీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు చెందిన సుమారు 65 మంది ఆహార వ్యాపార నిర్వాహకులు పాల్గొన్నారు