BREAKING
ఆమడగూరు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సిబ్బందిపై రైతులు కన్నెర! ఆటో కు తాళ్లు కట్టి వినూత్ననిరసన తెలిపిన ఆర్ సి పి నాయకులు ఇంధన పొదుపులో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆదర్శం రెండు ఫోటోల విధానంతో ఉపాధి హామీ కూలీలకు ఇబ్బందులు: వి నాగరాజు ఫాసిస్ట్ శక్తులను ఓడించాలి.. వామపక్షాలే ప్రత్యామ్నాయం: డి హరినాథ్ జై భీమ్ భవనానికి రూ.25 వేల విరాళం.. నూజివీడు జనసేనలో బర్మా ఫణి బాబు హవా.. ఇన్చార్జ్ పదవికి మళ్లీ గ్రీన్ సిగ్నల్? ఏపీలో రూ.2500 కోట్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ భారీ పెట్టుబడి పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది: ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ శ్రీ ఎం. వెంకటాద్రి .. ఆమడగూరు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సిబ్బందిపై రైతులు కన్నెర! ఆటో కు తాళ్లు కట్టి వినూత్ననిరసన తెలిపిన ఆర్ సి పి నాయకులు ఇంధన పొదుపులో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆదర్శం రెండు ఫోటోల విధానంతో ఉపాధి హామీ కూలీలకు ఇబ్బందులు: వి నాగరాజు ఫాసిస్ట్ శక్తులను ఓడించాలి.. వామపక్షాలే ప్రత్యామ్నాయం: డి హరినాథ్ జై భీమ్ భవనానికి రూ.25 వేల విరాళం.. నూజివీడు జనసేనలో బర్మా ఫణి బాబు హవా.. ఇన్చార్జ్ పదవికి మళ్లీ గ్రీన్ సిగ్నల్? ఏపీలో రూ.2500 కోట్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ భారీ పెట్టుబడి పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది: ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ శ్రీ ఎం. వెంకటాద్రి ..
www.ntodaynews.com

ఆమడగూరు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సిబ్బందిపై రైతులు కన్నెర!

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
19 May, 2026 - 06:08 AM
31 వీక్షణలు

ఎలాంటి పూచి కత్తు లేకుండా రైతులకు రెన్యువల్ చేయాలి!

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఎదుట ఆర్ సి పి ధర్నా! 

 ఎన్ టుడే న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు 

 శ్రీ సత్యసాయి జిల్లా ఆమడగూరు మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సిబ్బందిపై రైతుల ను రెన్యువల్ విషయంలో తీవ్ర ఇబ్బంది పెడుతుండడంతో రైతులు బ్యాంక్ సిబ్బంది మేనేజర్ వేణుగోపాల్ రెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్ వినోద్ పై రైతులు కన్బెర చేశారు. సోమవారం మండలంలోని వివిధ గ్రామాల నుంచి పంట రుణాలు రెన్యువల్ కోసం వచ్చిన రైతులు బ్యాంక్ సిబ్బంది పంట రుణాలు రెన్యూవల్ చేయడానికి చేయడానికి లేనిపోని సరతులు పెట్టి రైతులను చివరి ఇబ్బందులు కు గురి చేయడంతో రైతులు బ్యాంక్ సిబ్బందిపై ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ (ఆర్ సి పి) నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఎదుట బైఠాయించి రైతులకు బాసటగా నిలిచారు. ఈ సందర్భంగా ఎలాంటి సరతులు లేకుండా లేకుండా పంట రుణాలు రెన్యువల్ చేయాలని కోరుతూ బ్యాంకు ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆర్ సి పి పుట్టపర్తి నియోజకవర్గ ఇంచార్జ్ మున్నా మాట్లాడుతూ ఆమడగూరు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో నిబంధనలు పక్కనపెట్టి సత్య సాయి జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్ లో ఏ బ్రాంచ్ లో కూడా చేయని విధంగా ఆమడగూరు ఆంధ్రప్రదేశ్ బ్యాంకులో మేనేజర్ వేణుగోపాల్ రెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్ వినోద్ లు రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు 

 బ్యాంక్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పంట రుణాలు రెన్యూవల్ కోసం వచ్చిన రైతులు మాట్లాడుతూ పంట రుణాలు రెన్యువల్ కోసం గత 15 రోజులుగా పని వదిలేసి బ్యాంకు వద్ద పడిగాపులు కాస్తున్న హలో రెన్యువల్ కాలేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది రైతులు అప్పులు చేసి పంటలు సాగు చేసి , పంట సాగు కోసం తెచ్చిన అప్పులు తీర్చలేక, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వలస వెళ్లి బతుకుతున్నామని రైతులు తమ బాధను వ్యక్తం చేశారు. అయితే పంట రుణాలు రెన్యువుల కోసం ఆమడగురు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు కు వస్తే ఇక్కడ సిబ్బంది నెలలు తరబడి రెన్యువల్ కోసం తిప్పుకుంటున్నారని రైతులు బ్యాంక్ అధికారులపై మండిపడ్డారు. బ్యాంక్ సిబ్బంది రైతుల రెన్యువుల కోసం లేనిపోని నిబంధనలు పెట్టి , పూచి దారుడు, మరో నలుగురు సాక్షులు కావాలని తీవ్ర ఇబ్బందులుకు గురుచేస్తున్నారని ధర్నాలో రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. రైతులకు మద్దతుగా నిలిచిన ఆర్సీపీ నాయకులు బ్యాంక్ సిబ్బంది నీ నిలదీయగా మేము ఎలాంటి పంట రుణాలు విషయంలో పూచికత్తు అడగలేదని అయితే బ్యాంక్ మేనేజర్ వేణుగోపాల్ రెడ్డి తమ సేఫ్టీ కోసమే పూచికత్తు తీసుకుంటున్నామని చెప్పడంతో రైతుల తీవ్ర బ్యాంక్ సిబ్బందిపై ఆగ్రహ వ్యక్తం చేస్తారు. ఎట్టకేలకు రైతుల ఆందోళనతో దిగివచ్చిన బ్యాంక్ సిబ్బంది ఇప్పటినుంచే ఇలాంటి పుచ్చుకత్తులు లేకుండా పంట రుణాలు రెన్యువల్ చేస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు. ఈ కార్యక్రమంలో ఆర్సిపీ మండల కన్వి నర్ శ్రీనివాసులు. ఒడిసి మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ సందీప్ కుమార్, ఆర్సిపీ నాయకులు వెంకటేష్, నర్సింలు, కుళ్లాయప్ప, వెంకటేష్, సత్యప్ప, వేమ నారాయణ, నాగరాజు, రైతులు పాల్గొన్నారు