BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ఆన్‌లైన్‌లోనే ఓటరు వివరాల నమోదు.. ఎన్నికల సంఘం కీలక సూచన

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 02:34 PM
78 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ-2026 (Special Intensive Revision-2026) కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు ఎన్నికల సంఘం కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌వో) కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, ఓటర్లు ఇంటి నుంచే తమ ఓటరు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు లేదా ధృవీకరించుకోవచ్చు. ఇందుకోసం voters.eci.gov.in పోర్టల్‌ను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఓటర్లు తమ ఈపిక్ (EPIC) నంబర్, ఓటీపీ సహాయంతో లాగిన్ అయి ఇప్పటికే నమోదైన వివరాలను పరిశీలించడంతో పాటు అవసరమైన మార్పులు చేసుకునే అవకాశం ఉంది. అనంతరం పాత రికార్డులతో అనుసంధానం పూర్తి చేసి, ఆధార్ ఈ-సైన్ ద్వారా ఎన్యుమరేషన్ ఫారమ్‌ను సురక్షితంగా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. ఈ విధానం ద్వారా సమయం ఆదా కావడంతో పాటు ఓటరు జాబితాలో వివరాలు మరింత ఖచ్చితంగా నమోదు అయ్యే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆలస్యం చేయకుండా తమ వివరాలను ధృవీకరించి ఎన్యుమరేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేశారు.