www.ntodaynews.com
ఆర్టీసీ బస్సు ప్రమాదం: 24 మంది ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం
తెలంగాణ
/
మంచిర్యాల
ఆర్టీసీ బస్సు ప్రమాదం: 24 మంది ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల కేంద్రంలో గురువారం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. కళ్ళెంపల్లి నుంచి చెన్నూరు వైపు వెళ్తున్న బస్సు రోడ్డుపై ఉన్న కాచులాన్ని తాకడంతో సమీపంలోని కరెంట్ పోల్ విరిగి బస్సుపై పడింది.
అయితే అదృష్టవశాత్తూ బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 24 మంది ప్రయాణికులు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ సరఫరాను నిలిపివేసి, మరమ్మత్తు పనులు చేపట్టారు.
ఈ ఘటనతో కొంతసేపు ప్రాంతంలో ఆందోళన నెలకొంది.