www.ntodaynews.com
ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ శనివారం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్న శిక్షణ తరగతుల ఏర్పాట్లు, వసతులను పరిశీలించేందుకు చెన్నూర్ నుంచి మంచిర్యాల వరకు ఆయన ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సాయంత్రం ఆరు గంటల తర్వాత చెన్నూర్కు బస్సులు నడపకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ప్రయాణికులు వెంకటేశ్వర్ గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.