BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సర్కార్ చర్చలకు రావాల్సిందే

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
23 Apr, 2026 - 02:40 PM
34 వీక్షణలు

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సర్కార్ చర్చలకు రావాల్సిందే: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు డిమాండ్

​కాంగ్రెస్ పాలనలో కార్మికులకు అన్యాయం.. 36 డిమాండ్ల పరిష్కారం కోసం బీజేపీ సమరశంఖం

మంచిర్యాల జిల్లాలో ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జరిగిన మద్దతు కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆర్టీసీ కార్మికులు సుదీర్ఘకాలంగా పోరాడుతున్న 36 డిమాండ్లలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రభుత్వం మొండి వైఖరిని అవలంబిస్తోందని, కార్మికుల పట్ల ఈ వివక్ష ఏమాత్రం సరికాదని ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్మిక సమస్యలను గాలికొదిలేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సామరస్యంగా సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్మికుల పక్షాన బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కార్మికులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ తరపున పోరాటాలు కొనసాగిస్తామని రఘునాథరావు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు..