www.ntodaynews.com
ఆర్టీసీ సమ్మెతో పురుషులకూ ఉచిత ప్రయాణం
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలో ప్రయాణికులకు ఊరట లభిస్తోంది. కార్మికులు విధులకు దూరం కావడంతో కండక్టర్లు లేని కారణంగా, ప్రైవేట్ డ్రైవర్ల సహాయంతో బస్సులను నడిపిస్తూ అందరికీ ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రస్తుతం టికెట్లు తీసుకోవడం లేదని డీఎం వెల్లడించారు. దీనితో మహిళలతో పాటు పురుషులు కూడా ఉచితంగా గమ్యస్థానాలకు చేరుకుంటుండటంతో బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ప్రభుత్వం త్వరితగతిన స్పందించి రవాణా ఇబ్బందులను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు