BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 30 August 2026, 07:46 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆరుగొలనుపేట పాఠశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 07:46 AM
36 వీక్షణలు

ఆరుగొలనుపేట పాఠశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

గిడుగు వెంకట రామమూర్తి పంతులు సేవలు చిరస్మరణీయం

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం ఆరుగొలనుపేట మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. చంద్రు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా తెలుగు భాషా వికాసానికి విశేష కృషి చేసిన గిడుగు వెంకట రామమూర్తి పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ తెలుగు భాషా అభివృద్ధికి గిడుగు వెంకట రామమూర్తి పంతులు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రజలందరికీ సులభంగా అర్థమయ్యే వ్యవహారిక భాషకు ఆయన విశేష ప్రాధాన్యత కల్పించారని తెలిపారు. తెలుగు భాషను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యార్థులు తెలుగు భాషపై మక్కువ పెంచుకుని దాని గొప్పతనాన్ని తెలుసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని తెలుగు భాష గొప్పతనాన్ని వివరించే ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.