ఆరుగొలనుపేట పాఠశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
ఆరుగొలనుపేట పాఠశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
గిడుగు వెంకట రామమూర్తి పంతులు సేవలు చిరస్మరణీయం
ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం ఆరుగొలనుపేట మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. చంద్రు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా తెలుగు భాషా వికాసానికి విశేష కృషి చేసిన గిడుగు వెంకట రామమూర్తి పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ తెలుగు భాషా అభివృద్ధికి గిడుగు వెంకట రామమూర్తి పంతులు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రజలందరికీ సులభంగా అర్థమయ్యే వ్యవహారిక భాషకు ఆయన విశేష ప్రాధాన్యత కల్పించారని తెలిపారు. తెలుగు భాషను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యార్థులు తెలుగు భాషపై మక్కువ పెంచుకుని దాని గొప్పతనాన్ని తెలుసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని తెలుగు భాష గొప్పతనాన్ని వివరించే ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.