ఆరుగొలనుపేటలో టీడీపీ మండల విస్తృతస్థాయి సమావేశం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం ఆరుగొలనుపేట గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జగాని వెంకటేశ్వరరావు నివాసంలో నిర్వహించారు. సమావేశానికి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో బీఎల్ఏలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్వహించాల్సిన బాధ్యతలపై సమగ్రంగా చర్చించారు. అలాగే త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ కార్యకర్తలను సమన్వయం చేయడం, బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ఎన్నికలకు కార్యాచరణ సిద్ధం చేయడం వంటి అంశాలపై నాయకులు చర్చించారు.
ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు ఇజ్జగాని వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి పేళ్లూరు శేఖర్, క్లస్టర్-1 ఇన్చార్జి ఉయ్యాల దిలీప్ కుమార్, మోరంపూడి శ్రీనివాసరావు, మరిడి చిట్టిబాబు, మాదాసు చంద్రకళ, వెల్దీ రాజా, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.