BREAKING
మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన
www.ntodaynews.com

ఆసిఫాబాద్‌లో ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్న పోడు రైతులు.. భూములు వదులుకోమంటూ ఆందోళన

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 06:46 PM
14 వీక్షణలు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ భూముల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. జైనూర్ మండలం పులస గ్రామ శివారులో అటవీ భూమిని జేసీబీతో చదును చేసేందుకు వెళ్లిన అటవీశాఖ అధికారులను పోడు రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

తమ తాతముత్తాతల కాలం నుంచి ఇదే భూముల్లో సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నామని, ఇందుకు సంబంధించిన హక్కు పత్రాలు కూడా తమ వద్ద ఉన్నాయని రైతులు పేర్కొన్నారు. ఇప్పుడు భూములను స్వాధీనం చేసుకోవడానికి వస్తే తమ కుటుంబాలు ఎలా బతకాలని అధికారులను ప్రశ్నించారు.

"మమ్మల్ని అరెస్ట్ చేసినా, చంపినా ఈ భూములను వదులుకోం. మా జీవనాధారం ఇదే. భూములు పోతే ఉపాధి కోల్పోయి కుటుంబాలతో రోడ్డున పడాల్సి వస్తుంది" అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారులు, రైతులతో చర్చించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు.