ఆటో కు తాళ్లు కట్టి వినూత్ననిరసన తెలిపిన ఆర్ సి పి నాయకులు
పెంచిన పెట్రోల్ ధరలను... తగ్గించాలి!
ఎన్ టుడే న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు
శ్రీ సత్యసాయి జిల్లా ఆమడగూరు మండలంలోని పెంచిన పెట్రోల్ ,డీజిల్ గ్యాస్ , ధరలను తగ్గించాలని కోరుతూ సోమవారం రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ (ఆర్ సి పి) ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని వైఎస్ఆర్ సర్కిల్ నుంచి ఆటోకు విన్నతంగా తాడు లాగుతూ పెంచిన పెట్రోల్ ,డీజిల్ కు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక బస్టాండ్ ప్రాంతంలో రాస్తారకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ సి పి పుట్టపర్తి నియోజకవర్గ ఇంచార్జ్ మున్నా మాట్లాడుతూ పెట్రోల్ ,డీజిల్ పైన లీటర్ పై మూడు రూపాయలు మోపి పేద మధ్యతరగతి, సామాన్యులపై భారం మోపడం సిగ్గుచేటు అన్నారు. ఇరాన్, ఇరాక్, ఇజ్రాయిల్ అమెరికా ఇజ్రాయిల్ యుద్ధం చూపిస్తూ యుద్ధం సాకుగా చూపిస్తూ ఆయిల్ సంక్షోబం ఉందని దరల పెంచడం సమంజసం కాదన్నారు. పెట్రోల్ డీజిల్ దరలు ఒక్కసారిగా పెరగడంతో నిత్యాస సరుకులు దరల పెరిగి సామాన్య ప్రజలు జీవనో పదానికి , బ్రతకటానికి చాలా ఇబ్బందులు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ధరల పెంచడం మరోసారి ప్రజలను మోసం చేయడం తప్ప ప్రజల సంక్షేమం కోసం పాటుపడలేదని ఆయన మండిపడ్డారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ , గ్యాస్ ధరలు పెంచబోమని గొప్పలు చెప్పిన తెలుగుదేశం పార్టీ, కూటమి నాయకులు ఇప్పుడు ఏం చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెలిగారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించి సామాన్య మధ్య తరగతి , ప్రజలపై బారాలు తగ్గించాలన్నారు. అలాగే గ్యాస్ ఆమాంతరం పెరగడంతో చిన్నచిన్న , తోపుడు బండి, చిన్నచిన్న హోటల్లో గ్యాస్ ధరలు పెరగడంతో దిక్కుతోచుక హోటల్లో మూసే పరిస్థితి నెల కొందాని ఆయన అగ్రహారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక బస్టాండ్ ప్రాంతంలో ఒక గంటపాటు రాస్త రకో నిర్వహించారు. అనంతరం స్థానిక బస్టాండ్ నుంచి పురువీదుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ సి పి పుట్టపర్తి నియోజకవర్గ ఇన్చార్జి మున్నా, ఆర్ సి పి మండల కన్వీనర్ శ్రీనివాసులు, ఒడిసి మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ సందీప్ కుమార్, ఆర్ సి పి నాయకులు వెంకటేష్, నరసింహులు, కుళ్లాయప్ప, వెంకటేష్, వేమ నారాయణ, సత్యప్ప, నాగరాజు, వివిధ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు.