NTODAY NEWS :చిట్యాలనల్గొండ జిల్లా: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చిట్యాల పట్టణ నూతన కార్యవర్గాన్ని బుధవారం రోజున ఏబీవీపీ నలగొండ జిల్లా కన్వీనర్ జినుకుంట్ల జయేందర్ ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. ఏబీవీపీ చిట్యాల పట్టణ కార్యవర్గంలో పట్టణ అధ్యక్షునిగా జాల మల్లేష్ , పట్టణ కార్యదర్శిగా వంగూరి గణేష్ , సంయుక్త కార్యదర్శిగా సిద్దు, యశ్వంత్ , బాలికల కన్వీనర్ గా సైనోజు కావ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం ప్రసంగిస్తూ విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటం చేద్దామని, ప్రతి విద్యార్థికి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలను వినియోగించుకునేలా చేస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు కొంపెల్లి సూర్య. నవ్య శ్రీ , రమ్య శ్రీ , ధరణి తరుణ్, ఫణింద్ర, ముజాహిదుద్ద్, శశి , శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.Follow us onWebsiteFacebookInstagramYouTube