BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 02 October 2024, 04:16 am
Posted by : NTODAY NEWS OFFICIAL

బొమ్మలరామారం మండలంలో నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్ చేస్తున్న క్వారీ యజమానులపై చర్యలు తీసుకోవాలి-- ప్రజా పోరాట సమితి

తెలంగాణ
02 Oct, 2024 - 04:16 AM
242 వీక్షణలు
బొమ్మలరామారం మండలంలో పరిమితికి మించి జిలెటిన్ స్టిక్స్ వాడుతూ హై బ్లాస్టింగ్ చేస్తున్న స్టోన్ క్రషర్ల మీద కేసులు నమోదు చేయాలని ప్రజా పోరాట సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బొమ్మలరామారం ఎస్ఐ శ్రీశైలంకు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా ప్రజా పోరాట సమితి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీస శ్రీనివాస్, మైలారం జంగయ్య మాట్లాడుతూ క్వారీల్లో వాడే పేలుడు పదార్థాలకు లెక్కుకు మించి వాడుతున్నందున వారి మీద పరిశీలన చేసి కేసులు నమోదు చేయాలని కోరారు.బ్లాస్టింగ్ ఎక్కువ మోతాదులో చేయడం వల్ల రాయి దుమ్ము గ్రామాలను అంధకారంలో ముంచెత్తుతున్నాయని,మందు గుండు వాసనకు ఊపిరి ఆడటం లేదని తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.అసలు బ్లాస్టింగ్ అనుమతులు ఎంతవరకున్నాయో తనిఖీ చేయాలని, అప్పుడు వారి అసలు బాగోతం బయటపడుతుందన్నారు.అతి భారీ బ్లాస్టింగ్ బారినుండి ప్రజలను కాపాడాలని కోరారు. అధిక లోడుతో లారీలు మూలమలుపుల వద్ద కంకర కింద పడడంతో వాహనదారులు కింద పడుతున్నారు,రాళ్ళు ఎగిరి తలలకు తగులుతున్నాయని క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వట్టిపల్లి సుదర్శన్,సహాయ కార్యదర్శి మైలారం సుదర్శన్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.