BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

బొమ్మలరామారం మండలంలో నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్ చేస్తున్న క్వారీ యజమానులపై చర్యలు తీసుకోవాలి-- ప్రజా పోరాట సమితి

తెలంగాణ
02 Oct, 2024 - 04:16 AM
149 వీక్షణలు
బొమ్మలరామారం మండలంలో పరిమితికి మించి జిలెటిన్ స్టిక్స్ వాడుతూ హై బ్లాస్టింగ్ చేస్తున్న స్టోన్ క్రషర్ల మీద కేసులు నమోదు చేయాలని ప్రజా పోరాట సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బొమ్మలరామారం ఎస్ఐ శ్రీశైలంకు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా ప్రజా పోరాట సమితి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీస శ్రీనివాస్, మైలారం జంగయ్య మాట్లాడుతూ క్వారీల్లో వాడే పేలుడు పదార్థాలకు లెక్కుకు మించి వాడుతున్నందున వారి మీద పరిశీలన చేసి కేసులు నమోదు చేయాలని కోరారు.బ్లాస్టింగ్ ఎక్కువ మోతాదులో చేయడం వల్ల రాయి దుమ్ము గ్రామాలను అంధకారంలో ముంచెత్తుతున్నాయని,మందు గుండు వాసనకు ఊపిరి ఆడటం లేదని తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.అసలు బ్లాస్టింగ్ అనుమతులు ఎంతవరకున్నాయో తనిఖీ చేయాలని, అప్పుడు వారి అసలు బాగోతం బయటపడుతుందన్నారు.అతి భారీ బ్లాస్టింగ్ బారినుండి ప్రజలను కాపాడాలని కోరారు. అధిక లోడుతో లారీలు మూలమలుపుల వద్ద కంకర కింద పడడంతో వాహనదారులు కింద పడుతున్నారు,రాళ్ళు ఎగిరి తలలకు తగులుతున్నాయని క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వట్టిపల్లి సుదర్శన్,సహాయ కార్యదర్శి మైలారం సుదర్శన్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.