BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

బొమ్మలరామారం మండలంలో నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్ చేస్తున్న క్వారీ యజమానులపై చర్యలు తీసుకోవాలి-- ప్రజా పోరాట సమితి

తెలంగాణ
02 Oct, 2024 - 04:16 AM
202 వీక్షణలు
బొమ్మలరామారం మండలంలో పరిమితికి మించి జిలెటిన్ స్టిక్స్ వాడుతూ హై బ్లాస్టింగ్ చేస్తున్న స్టోన్ క్రషర్ల మీద కేసులు నమోదు చేయాలని ప్రజా పోరాట సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బొమ్మలరామారం ఎస్ఐ శ్రీశైలంకు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా ప్రజా పోరాట సమితి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీస శ్రీనివాస్, మైలారం జంగయ్య మాట్లాడుతూ క్వారీల్లో వాడే పేలుడు పదార్థాలకు లెక్కుకు మించి వాడుతున్నందున వారి మీద పరిశీలన చేసి కేసులు నమోదు చేయాలని కోరారు.బ్లాస్టింగ్ ఎక్కువ మోతాదులో చేయడం వల్ల రాయి దుమ్ము గ్రామాలను అంధకారంలో ముంచెత్తుతున్నాయని,మందు గుండు వాసనకు ఊపిరి ఆడటం లేదని తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.అసలు బ్లాస్టింగ్ అనుమతులు ఎంతవరకున్నాయో తనిఖీ చేయాలని, అప్పుడు వారి అసలు బాగోతం బయటపడుతుందన్నారు.అతి భారీ బ్లాస్టింగ్ బారినుండి ప్రజలను కాపాడాలని కోరారు. అధిక లోడుతో లారీలు మూలమలుపుల వద్ద కంకర కింద పడడంతో వాహనదారులు కింద పడుతున్నారు,రాళ్ళు ఎగిరి తలలకు తగులుతున్నాయని క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వట్టిపల్లి సుదర్శన్,సహాయ కార్యదర్శి మైలారం సుదర్శన్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.