BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

అవమానించిన పూజారులపై చర్యలు తీసుకోవాలి

తెలంగాణ
24 Jan, 2026 - 08:47 PM
289 వీక్షణలు
దళిత మహిళను అవమానించిన పూజారులపై చర్యలు తీసుకోవాలి NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్: రాఘవేంద్ర రాజు ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ) ఆధ్వర్యంలో అంటరానితనం, కుల వివక్షతకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. శంకరప్ప మాట్లాడుతూ, కర్నూలు జిల్లా ఓర్వగల్ మండలం సోమయాజులపల్లి గ్రామంలోని గ్రామ దేవత సుంకులమ్మ ఆలయంలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించారు. అదే గ్రామానికి చెందిన దళిత మహిళ, జిల్లా ఎస్సీ ఎస్టీ బాండ్రీ కమిటీ సభ్యురాలు మాలతి సంక్రాంతి పండుగ సందర్భంగా గుడిలో పూజ కోసం వెళ్లగా, అక్కడి పూజారులు బలిజి జనార్ధన్ మరియు అతని కుమారుడు వంశీ ఆమెను కులం పేరుతో దూషిస్తూ, గుడిలోకి ప్రవేశించరాదని చెప్పి అవమానించినట్లు ఆరోపించారు. దళిత మహిళపై అసభ్య పదజాలంతో దూషించి, అంటరానితనం ప్రదర్శిస్తూ గుడి బయట నిలబెట్టి అవమానించారని పేర్కొన్నారు. ఈ ఘటనపై వెంటనే పూజారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, వారిని ఆలయం నుంచి తొలగించాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై రాష్ట్ర హోం శాఖ, పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి చట్టరీతిగా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పుంగనూరు పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్‌కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని త్రొక్కే విధంగా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని దళిత నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు రాష్ట్ర సెక్రటరీ చీటీ గంగప్ప, ప్రచార కార్యదర్శి పెంచుపల్లి కృష్ణప్ప, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కె. లక్ష్మీపతి, రాష్ట్ర కమిటీ సభ్యుడు మర్లపల్లి కృష్ణప్ప, జిల్లా కార్యదర్శి ఎస్. నాగరాజు, దళిత నాయకులు ఏ. కుమార్, ఈస్ట్ పేట బాలాజీ, రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. #DalitRights #CasteDiscrimination #SCSTAtrocitiesAct #SocialJustice #StopUntouchability #HumanRights #AndhraPradesh #Punganur #DalitWomenRights Follow us on Website Facebook Instagram YouTube