BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

ఏలూరు జిల్లా చింతలపూడిలో జన జాగృతి కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 04:39 PM
67 వీక్షణలు

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం అల్లిపెల్లి గ్రామంలోని RCM పాఠశాలలో నిర్వహించిన జన జాగృతి కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా మోకాసత్తిబాబు (అడిషనల్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ – ట్రైనింగ్, మంగళగిరి) పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువుపై ఆసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. అంబేద్కర్ జీవనశైలిని ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణతో చదవాలని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపించి వారిని ప్రోత్సహించాలని సూచించారు.

తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తీసుకుంటూ చదువుకొని ఈ స్థాయికి చేరుకున్నానని, తన ఎదుగుదలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి స్ఫూర్తే కారణమని ఆయన తెలిపారు. చదువు మనిషి జీవితాన్ని మార్చే శక్తి కలదని, విద్యార్థులు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో ఫాదర్ మరియజోజి రాయి, సాయి స్పూర్తి హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్లు, నర్సులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.