BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

ఏలూరు జిల్లా చింతలపూడిలో జన జాగృతి కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 04:39 PM
118 వీక్షణలు

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం అల్లిపెల్లి గ్రామంలోని RCM పాఠశాలలో నిర్వహించిన జన జాగృతి కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా మోకాసత్తిబాబు (అడిషనల్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ – ట్రైనింగ్, మంగళగిరి) పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువుపై ఆసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. అంబేద్కర్ జీవనశైలిని ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణతో చదవాలని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపించి వారిని ప్రోత్సహించాలని సూచించారు.

తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తీసుకుంటూ చదువుకొని ఈ స్థాయికి చేరుకున్నానని, తన ఎదుగుదలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి స్ఫూర్తే కారణమని ఆయన తెలిపారు. చదువు మనిషి జీవితాన్ని మార్చే శక్తి కలదని, విద్యార్థులు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో ఫాదర్ మరియజోజి రాయి, సాయి స్పూర్తి హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్లు, నర్సులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.