ఏలూరు జిల్లా చింతలపూడిలో జన జాగృతి కార్యక్రమం
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం అల్లిపెల్లి గ్రామంలోని RCM పాఠశాలలో నిర్వహించిన జన జాగృతి కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా మోకాసత్తిబాబు (అడిషనల్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ – ట్రైనింగ్, మంగళగిరి) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువుపై ఆసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. అంబేద్కర్ జీవనశైలిని ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణతో చదవాలని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపించి వారిని ప్రోత్సహించాలని సూచించారు.
తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తీసుకుంటూ చదువుకొని ఈ స్థాయికి చేరుకున్నానని, తన ఎదుగుదలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి స్ఫూర్తే కారణమని ఆయన తెలిపారు. చదువు మనిషి జీవితాన్ని మార్చే శక్తి కలదని, విద్యార్థులు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో ఫాదర్ మరియజోజి రాయి, సాయి స్పూర్తి హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్లు, నర్సులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.