BREAKING
ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం హుజురాబాద్ కు సమీపంలోని వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్ట్ ను వెంటనే రద్దు చేయాలి ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం హుజురాబాద్ కు సమీపంలోని వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్ట్ ను వెంటనే రద్దు చేయాలి
www.ntodaynews.com

ఏలూరు జిల్లా చింతలపూడిలో జన జాగృతి కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 04:39 PM
39 వీక్షణలు

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం అల్లిపెల్లి గ్రామంలోని RCM పాఠశాలలో నిర్వహించిన జన జాగృతి కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా మోకాసత్తిబాబు (అడిషనల్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ – ట్రైనింగ్, మంగళగిరి) పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువుపై ఆసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. అంబేద్కర్ జీవనశైలిని ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణతో చదవాలని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపించి వారిని ప్రోత్సహించాలని సూచించారు.

తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తీసుకుంటూ చదువుకొని ఈ స్థాయికి చేరుకున్నానని, తన ఎదుగుదలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి స్ఫూర్తే కారణమని ఆయన తెలిపారు. చదువు మనిషి జీవితాన్ని మార్చే శక్తి కలదని, విద్యార్థులు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో ఫాదర్ మరియజోజి రాయి, సాయి స్పూర్తి హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్లు, నర్సులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.