రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం
శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దుబ్బ దానయ్య కుటుంబాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా దివంగత కొలుసు పెద్ద రెడ్డయ్య యాదవ్ స్మారకార్థం నిర్వహిస్తున్న కొలుసు పెద్ద రెడ్డయ్య యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.2 లక్షలు, యాదవ్ సంఘం తరఫున రూ.3 లక్షలు కలిపి మొత్తం రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి మంత్రి అందజేశారు.
మంత్రి మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగేలా కట్టుబడి ఉన్నామని తెలిపారు. అవసరమైన సహాయ సహకారాలు అందేలా వ్యక్తిగతంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.