BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం

ఆంధ్రప్రదేశ్
/ శ్రీకాకుళం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jul, 2026 - 04:13 PM
10 వీక్షణలు

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దుబ్బ దానయ్య కుటుంబాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా దివంగత కొలుసు పెద్ద రెడ్డయ్య యాదవ్ స్మారకార్థం నిర్వహిస్తున్న కొలుసు పెద్ద రెడ్డయ్య యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.2 లక్షలు, యాదవ్ సంఘం తరఫున రూ.3 లక్షలు కలిపి మొత్తం రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి మంత్రి అందజేశారు.

మంత్రి మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగేలా కట్టుబడి ఉన్నామని తెలిపారు. అవసరమైన సహాయ సహకారాలు అందేలా వ్యక్తిగతంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.