ఏప్రిల్ 21న శంకరజయంతి
ఏప్రిల్ 21న శంకరజయంతి
శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం
ఏప్రిల్ 21వ తేదీ వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా ఆదిశంకరుల వారి జయంతి ఉత్సవం నిర్వహించబడుతుంది. ఈ జయంతి ఉత్సవంలో భాగంగా ఫాలధార -పంచధారల వద్ద గల శంకరమందిరంలో ఉదయం గం.9.00లకు ప్రత్యేక పూజలు జరిపించబడతాయి. ఈ విశేష పూజలలో చంద్రమౌళీశ్వరస్వామికి, శారదాదేవికి, శంకరుల వారికి జలాభిషేకం, బిల్వపత్రపూజ, నీరాజన మంత్రపుష్పములు, అర్చనలు జరుగనున్నాయి.
కాగా ఆదిశంకరుల వారికి, శ్రీశైల క్షేత్రానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. శంకరులవారు శ్రీశైలంలోని ఫాలధార –పంచధార వద్ద కొంతకాలం తపస్సు చేసి ఇక్కడే తమ శివానందలహరి గ్రంథాన్ని రచించారు. ఈ శివానందలహరిలో శ్రీశైలక్షేత్రాన్ని, శ్రీభ్రమరాంబా మల్లికార్జునులను స్తుతించారు. అదేవిధంగా శంకరుల వారు యోగతారావళి అనే గ్రంథంలో శ్రీశైలంలోనే సమాధిని పొందాలని అభిలషించారని చెప్పబడుతోంది.