ఐతుపల్లి, ఎల్లాపూర్ గ్రామాల్లో సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ఐతుపల్లి, ఎల్లాపూర్ గ్రామాల్లో సీతారాముల
పెగడపల్లి: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెగడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. మండల పరిధిలోని ఐతుపల్లి మరియు ఎల్లాపూర్ గ్రామాల్లో అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని రామాలయాలను దర్శించుకున్న మంత్రికి ఆలయ పూజారులు, కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శ్రీ సీతారామ లక్ష్మణుల ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు, ముఖ్యంగా ధర్మపురి నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, అందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.