BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

అక్రమ బ్లాస్టింగ్ లపై ఫిర్యాదు విచారణ

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
30 Mar, 2026 - 03:38 PM
500 వీక్షణలు

అక్రమ బ్లాస్టింగ్ లపై ఫిర్యాదు విచారణ జరిపిన బొమ్మలరామారం మండల తహసిల్దార్ పి.శ్రీనివాసరావు

యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలంలోని రామలింగంపల్లి గ్రామంలో రాత్రి సమయంలో అతి భారీ బ్లాస్టింగ్ తో ఇండ్ల పైకప్పులు, పెచ్చులు ఊడి పడిపోతున్నాయని క్రషర్లపైన తగు చర్య తీసుకోవాలని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కు  ఫిర్యాదు చేయడంతో మైనింగ్ శాఖ  ఆదేశాల అనుసారం రామలింగంపల్లి రెవెన్యూ పరిధిలోగల క్రషర్ లను బ్లాస్టింగ్ వల్ల దెబ్బతిన్నా ఇల్లులను సోమవారం రోజున మండల తాహసిల్దార్ పి.శ్రీనివాసరావు పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, మైనింగ్ శాఖ ఇచ్చిన ఆదేశాలనుసారం విచారణ జరిపామని తెలిపారు పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్ కు పంపడం జరుగుతుందని అన్నారు ఈ విచారణలో పాల్గొన్న రామలింగంపల్లి సర్పంచ్ సుంచు యాదగిరి మాట్లాడుతూ రామలింగంపల్లి గ్రామంలో భయానిక పరిస్థితి నెలకొన్నదని అన్నారు గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న బాలాజీ క్రెషర్ కంపెనీ, రెయిన్ బో కంపెనీ,ఎస్వీఆర్ కంపెనీ,ఆర్ కే డి కంపెనీల వల్ల ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి అని అన్నారు గ్రామ పరిసర ప్రాంతాల్లో పరిమితికి మించి బ్లాస్టింగ్ (Blasting) నిర్వహించడం వల్ల ఇళ్ల గోడలు, పెచ్చులు పగిలిపోతున్నాయి అని అన్నారు దీంతో కొన్ని ఇళ్లలో పెచ్చులు  ఉడిపోవడంతో ఎప్పుడు కూలిపోతాయో అని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు  ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్లలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది అని అన్నారు గ్రామస్థులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బ్లాస్టింగ్ పనులను నియంత్రించాలని, నష్టపోయిన ఇళ్లకు పరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు