అక్రమ బ్లాస్టింగ్ లపై ఫిర్యాదు విచారణ
అక్రమ బ్లాస్టింగ్ లపై ఫిర్యాదు విచారణ జరిపిన బొమ్మలరామారం మండల తహసిల్దార్ పి.శ్రీనివాసరావు
యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలంలోని రామలింగంపల్లి గ్రామంలో రాత్రి సమయంలో అతి భారీ బ్లాస్టింగ్ తో ఇండ్ల పైకప్పులు, పెచ్చులు ఊడి పడిపోతున్నాయని క్రషర్లపైన తగు చర్య తీసుకోవాలని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో మైనింగ్ శాఖ ఆదేశాల అనుసారం రామలింగంపల్లి రెవెన్యూ పరిధిలోగల క్రషర్ లను బ్లాస్టింగ్ వల్ల దెబ్బతిన్నా ఇల్లులను సోమవారం రోజున మండల తాహసిల్దార్ పి.శ్రీనివాసరావు పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, మైనింగ్ శాఖ ఇచ్చిన ఆదేశాలనుసారం విచారణ జరిపామని తెలిపారు పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్ కు పంపడం జరుగుతుందని అన్నారు ఈ విచారణలో పాల్గొన్న రామలింగంపల్లి సర్పంచ్ సుంచు యాదగిరి మాట్లాడుతూ రామలింగంపల్లి గ్రామంలో భయానిక పరిస్థితి నెలకొన్నదని అన్నారు గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న బాలాజీ క్రెషర్ కంపెనీ, రెయిన్ బో కంపెనీ,ఎస్వీఆర్ కంపెనీ,ఆర్ కే డి కంపెనీల వల్ల ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి అని అన్నారు గ్రామ పరిసర ప్రాంతాల్లో పరిమితికి మించి బ్లాస్టింగ్ (Blasting) నిర్వహించడం వల్ల ఇళ్ల గోడలు, పెచ్చులు పగిలిపోతున్నాయి అని అన్నారు దీంతో కొన్ని ఇళ్లలో పెచ్చులు ఉడిపోవడంతో ఎప్పుడు కూలిపోతాయో అని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్లలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది అని అన్నారు గ్రామస్థులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బ్లాస్టింగ్ పనులను నియంత్రించాలని, నష్టపోయిన ఇళ్లకు పరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు