www.ntodaynews.com
అక్రమ పశువుల రవాణాపై ఉక్కుపాదం: మంచిర్యాల డీసీపీ భాస్కర్
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల : రాబోయే బక్రీద్ పండుగ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, అక్రమ పశువుల రవాణా నియంత్రణే ధ్యేయంగా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ స్పష్టం చేశారు. మంగళవారం స్లాటర్ హౌస్ నిర్వాహకులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అక్రమ పశువుల రవాణాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. పశువుల కొనుగోలు, రవాణా, మరియు వధ ప్రక్రియల్లో ప్రభుత్వ నిబంధనలను, కోర్టు మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. బక్రీద్ పండుగను అత్యంత ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు పూర్తి స్థాయిలో సహకరించాలని, చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని డీసీపీ తేల్చి చెప్పారు